2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,417 - పురుషులు 44,383 - స్త్రీలు 45,034
==వ్యవసాయం, పంటలు==
ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నాయి.ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టుప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది. ఇక్కడికి రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.భైంసాలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్లో 16042 హెక్టార్లు, రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333</ref>
==వార్తలలో భైంసా==
అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.
==వాగులు==
*[[గడ్డెన్న వాగు]]
==ఇవి కూడా చూడండి==
* తుల్జాబాయి గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు '''[[చర్చ:తుల్జాబాయి]]''' చూడండి.