అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 8:
తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పాడు.<ref name=":2" />
ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.<ref name=":2" />
== పంపిణీ ==
|