అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== చరిత్ర ==
గోధుమనూకతో తయారుచేసే అన్నవరం ప్రసాదం ఎప్పుడు ప్రారంభం అయింది అన్న విషయంపై దేవస్థానం అధికారుల వద్ద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు. గోధుమలతోనే ఈ ప్రసాదం తయారుచేయడం వెనుక ఉత్తరాది వారి ప్రభావం ఉంది అని అన్నవరం ప్రాంతంలో ప్రచారం ఉంది. 19వ శతాబ్దిలో కలకత్తా (నేటి [[కోల్‌కాతా]]) నుంచి మద్రాసు (నేటి [[చెన్నై]]) వరకూ వేసిన రైల్వేలైను [[అన్నవరం]] మీదుగా వెళ్ళిందనీ, ఆ రైలుకట్ట నిర్మించేందుకు వచ్చిన ఉత్తరాది వారి ఆహారంలోని గోధుమలు స్థానికుల ఆహారంపై ప్రభావం పడివుంటుందనీ, అలా తమ వంటల్లో భాగమైన గోధుమల వంటకాన్ని స్వామివారికి నివేదించడం వల్ల ఈ ప్రసాదం ప్రారంభమై ఉంటుందని ఈ కథనం చెప్తోంది. ఈ వాదనను దేవస్థాన అర్చకులు తిరస్కరిస్తున్నారు. స్కంధ పురాణాంతర్గతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉందనీ, స్వామి వారికి అరటిపళ్ళు, పాలు, నెయ్యి, గోధుమలు ఇష్టమనీ చెప్తున్నారు.<ref name=":2" />
 
== తయారీ ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు