భరతనాట్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
==పుట్టుక==
ఈ రోజున భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరతనాట్యం ఎక్కువ ప్రాధాన్యతనూ ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. దానికి ప్రధాన కారణం దాని మూలాలు మత ప్రాధాన్యతను కలిగి ఉండటమే. అంతే కాక తమిళుల చొరవ, ఆ శాస్త్రాన్ని తమ సొంతంగా వారు భావించటం కూడా భరతనాట్య ప్రాభవానికి కారణాలు. పుట్టుక విషయానికి వస్తే, భరతనాట్యాన్ని రచించింది భరతముని కాగా, ప్రస్తుతం వాడుక లో ఉన్న భరతనాట్యశాస్త్రాన్ని ఒక తాటి పైకి తెచ్చి, అమలు పరచిన వారు [[పందనల్లూరు]]కి చెందిన పొన్నయ్య, చెన్నయ్య, వడివేలు, శివానందం అనబడే నలుగురు అన్నదమ్ములయిన నట్టువన్నులు. వీరు పధ్ధెనిమిదవ ([[18|పధ్ధెనిమిదవ శతాబ్దం]] )శతాబ్దానికి చెందినవారు. విద్వాన్ శ్రీ [[మీనాక్షీ సుందరం పిళ్ళై]] వీరి వారసులే.
ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి, ఒక వినోదంగా కాకుండా, ఒక శాస్త్రంగా గుర్తింపు, గౌరవం తెచ్చి, సామాన్యులందరికీ అందుబాటులోకి తెచ్చిన వారు శ్రీ రుక్మిణీదేవి అరుండలే. ఈమె మద్రాసు దగ్గరి తిరువన్మయూర్ లో " [[కళాక్షేత్ర]] " అనబడే గురుకుల స్థాయి పాఠశాల స్థాపించారు.
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/భరతనాట్యం" నుండి వెలికితీశారు