భారతదేశపు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు లేని POV వ్యాఖ్యలు తొలగించాను.
పంక్తి 2:
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|"భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.]]
'''జిల్లా''' భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు.ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. దేశంలో 545 లోక్ సభ సభ్యులున్నారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల కన్నా జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పార్లమెంటు నియోజకవర్గాల (42) కంటే జిల్లాలు (23) తక్కువగా ఉన్నాయి.1983 లో దేశం లోని జిల్లాల సంఖ్య 418.2015 లో 678.2016 అక్టోబరులో తెలంగాణాలో ఒక్కసారే 21 కొత్తజిల్లాలు ఏర్పాటయ్యాయి.జిల్లా కేంద్రం అంటే జిల్లా అభివృద్ధికి కేంద్రం. సాధారణంగా రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది.జిల్లా కేంద్రం చూట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది. 111 ఏళ్ల తరువాత తెలంగాణాలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. సరిగ్గా 111 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచనే పాలకులకు రాలేదు. 1905లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. 1953లో ఏర్పడిన ఖమ్మం జిల్లా 1978లో ఏర్పడిన రంగారెడ్డి జిల్లా మినహాయిస్తే, మిగిలిన తెలంగాణలోని జిల్లాలన్నీ 111 సంవత్సరాల క్రితం ఏర్పడినవే.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. [[తిరుపతి]] జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది.38 ఏళ్ల తర్వాత 21 కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి.ఈ జిల్లాల పునర్విభజనను చాలా మంది 1980లలో ఎన్టీఆర్‌ మండల వ్యవస్థతో పోలుస్తున్నారు.జిల్లాల పరమార్థం అభివృద్ధి వికేంద్రీకరణే.జిల్లా యూనిట్‌గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ చార్జీలు తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య పెంచవల్సి వస్తుంది.అది ఉపాధి అవకాశాలు పెంచుతుంది.
 
 
== విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశపు_జిల్లా" నుండి వెలికితీశారు