అంతర్జాలంలో తెలుగు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →ఈ-తెలుగు |
→తెలుగులో వెబ్సైట్లు: కంప్యూటర్లలో తెలుగును చూపించడం విభాగంలో సమాచార్ం చేర్పు |
||
పంక్తి 1:
అంతర్జాలంలో తెలుగు చరిత్ర 1990 లలో మొదలైంది. ఐ.ఆర్.సి చానెళ్ళలో చర్చలతో తెలుగు మొదలైంది. అది యాహూ గ్రూపులలో కొనసాగింది. అప్పట్లో తెలుగు భాషను రోమను లిపిలో రాసేవాళ్ళు. యూనికోడ్ తెలుగు ఫాంట్ల రాకతో ఆ సమస్య తీరిపోయింది. అ తరువాత తెలుగు యాహూ గ్రూపులను గూగుల్ గ్రూపులను దాటి వెబ్సైట్లు, బ్లాగుల లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఇతర సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటి లోకి విస్తరించింది.
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని
కంప్యూటర్లో తెలుగులో రాయడం అనేది తరువాతి సమస్య. బహుశా తెలుగు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఇదే. తెలుగులో రాసేందుకు అవసరమైన పనిముట్లను అభివృద్ధి చేసి వెబ్ వ్యాప్తంగా అందుబాటు లోకి తేవడం మొదలయ్యాక ఈ సమస్యకు పరిష్కారం మొదలైంది. రైస్ ట్రాన్స్లిటరేషన్ సిస్టమ్ అనేది తెలుగును తేలిగ్గా రాయగలిగే తొలి వ్యవస్థ. రోమను లిపిలో తెలుగును రాస్తే తెలుగు లిపి లోకి లిప్యంతరీకరణ చెయ్యడం ఈ పద్ధతి ప్రత్యేకత. ఈ పద్ధతినే వాడి మరింత తేలిగ్గా తెలుగులో రాయగలిగే లేఖిని వంటి ఉపకరణాలు రావడంతో తెలుగులో రాసే వీలు మరింత పెరిగింది. ఆ విధంగా తెలుగు విస్తరణ వేగం పుంజుకుంది.
== కంప్యూటరులో తెలుగును సాధ్యపరచిన సాధనాలు ==
=== రోమను లిపిలో తెలుగు ===
పంక్తి 13:
=== కంప్యూటర్లలో తెలుగును చూపించడం ===
2000 కు ముందు ఉన్న కంప్యూటర్లలో చాలా వరకు తెలుగును సహజంగా చూపేందుకు సాంకేతికంగా సిద్ధంగా ఉండేవి కావు. తెలుగు కనబడాలంటే వాటి ఆపరేటింగ్ వ్యవస్థ సెట్టింగుల్లో కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చేది. విండోస్ ఎక్స్.పి వచ్చాక ఆ సమస్య చాలా వరకు తీరిపోయింది. ఎక్స్.పి ఆపరేటింగ్ వ్యవస్థలో తెలుగును చూపించే ఏర్పాటు ముందే ఉండేది. ఎలాంటి సెట్టింగులూ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గౌతమి ఫాంటు ముందే ఇమిడ్చి ఉండేది. అయితే, చాలామంది విండోస్ 95, 98 లే వాడుతూ ఉండేవారు కాబట్టి ఈ సమస్య 2007-08 వరకూ ఉంటూనే ఉండేది. ఈ సమస్య తీరిపోవడం అనేది తెలుగు వ్యాప్తిలో తొలి అడ్డంకి తొలగినట్లైంది.
=== కంప్యూటరులో తెలుగు రాయడం ===
కంప్యూటరులో తెలుగులో రాయడం అనేది తెలుగు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. తెలుగు రాసేందుకు అనుగుణమైన పరికరాలు, కీబోర్డు లేఔట్లూ రావడంతో ఈ సమస్య పరిష్కారం కావడం మొదలైంది. తెలుగు టైపింగు నేర్చుకునే అవసరం లేకుండానే రోమను లిపిలో రాస్తే తెలుగు లోకి మార్చేసే పరికరాలు రావడం ఈ పరిష్కారాన్ని వేగవంతం చేసింది. అలాంటి పరికరాల్లో మొదటిది "పద్మ". ఈ పద్మ పరికరాన్ని తయారుచేసినది [[వెన్న నాగార్జున]]. ఈ పరికరాన్ని అప్పట్లో అందుబాటులో ఉన్న జియోసిటీస్.కాం సైటులో పెట్టి అందరికీ ఉచితంగా వాడుకునేందుకు అందుబాటులో ఉంచాడు. ఒక పెట్టెలో రాయదలచిన పాఠ్యాన్ని రోమను లిపిలో రాసి మార్చమని ఒక బొత్తాన్ని నొక్కితే, తెలుగు పాఠ్యం కనిపించేది. ప్రస్తుతం ఈ పద్మ పరికరం oocities.org అనే సైటులో అందుబాటులో ఉంది
ఆ తరువాత 2006 మార్చిలో లేఖిని ఉనికి లోకి వచ్చింది. [[వీవెన్]] సృష్టించిన ఈ సైటు తెలుగులో రాయడానికి మరింత వీలు కల్పించింది. ఒక పెట్టెలో రోమను లిపిలో రాస్తూ ఉంటే కిందనే ఉన్న మరో పెట్టెలో అది తెలుగు లోకి మారుతూ కనిపిస్తుంది. అనే క సంవత్సరాలుగా ఈ సైటు కంప్యూటర్లో తెలుగు రాయడానికి ఉపయోగపడుతూ ఉంది.
=== ఈ-తెలుగు ===▼
▲=== ఈ-తెలుగు ప్రచారం ===
అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు ఈ-తెలుగు సంస్థ మార్గదర్శక కృషి చేసింది. అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే లక్ష్యంతో కొందరు ఔత్సాహికులు 2007 మే లో ఈ-తెలుగు సంస్థను ఏర్పాటు చేసారు.2008 ఏప్రిల్లో అధికారికంగా నమోదు చేసారు. "''మీ కంప్యూటరుకు తెలుగొచ్చా?"'' అనే ప్రసిద్ధి గాంచిన ప్రశ్నతో సంస్థ తన ప్రచారం మొదలుపెట్టింది. వివిధ ఆపరేటింగు వ్యవస్థలలో తెలుగు కనబడేలా చేసుకోవడం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనేవి చెబుతూ తెలుగుకు ప్రచారం కల్పించింది. అది చురుగ్గా పనిచేసిన సుమారు మూడేళ్ళ కాలంలో, ఉచిత కరపత్రాలతో, చిరుపొత్తాలతో పుస్తక ప్రదర్శనల వంటి ప్రదేశాల్లో క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించింది. వివిధ బ్లాగు కూడళ్ళకు, వెబ్సైట్లకు, వికీపీడియాకు, అంతర్జాల సంబంధ సాంకేతిక సహాయం అందించే సైట్లకూ అది ప్రచారం కల్పించింది.
== తెలుగులో వెబ్సైట్లు ==
2000 దశాబ్దపు తొలి సంవత్సరాల్లో అంతర్జాలంలో తెలుగు వెబ్సైట్లలో పత్రికలు, గ్రూపులు, బ్లాగులు, మెయిలింగ్ లిస్టులు, ఇతర సామాజిక మాధ్యమాలు వగైరాలు ఉండేవి. 2004 కు ముందు తెలుగులో వెబ్సైట్లు
=== పత్రికలు ===
తెలుగు వార్తా పత్రికల్లో మొదటగా అంతర్జాలంలో ప్రవేశించినది ఈనాడు. తొలుత ఈసైటులో వార్తలను కారెక్టర్ల రూపంలో కాకుండా, బొమ్మల రూపంలో ప్రచురించేవారు. ఆ తరువాత తమ స్వంత ఫాంట్లతో ప్రచురించడం మొదలుపెట్టారు. అయితే వాడుకరులకు తెలుగు కనబడేది కాదు చిక్కిరి బిక్కిరి కారెక్టర్లు కనబడేవి. ఆ సైటు నుండి ఫాంట్లను వాడుకరి కంప్యూటరు లోకి దించుకుంటే, అప్పుదు తెలుగు అక్షరాలు కనబడేవి. ఈ పద్ధతినే అంధ్రజ్యోతి వంటి ఇతర వెబ్సైట్లు కూడా అనుసరించాయి. యూనికోడ్ వచ్చాక ఈ సమస్య తీరిపోయింది. యూనికోడు రూపంలో ఏ భాషలో ప్రచురించిన పేజీ అయినా ఫాంట్లేవీ దించుకునే అవసరం లేకుండానే ఏ కంప్యూటరులోనైనా కనబడేది
== ఫాంట్ల రంగంలో ==
మొదట్లో తెలుగు ఫాంట్లు యూనీకోడులో కాకుండా వేరే ఎన్కోడింగు పద్ధతుల్లో ఉండేవి. అను ఫాంట్స్ అనేవి అటువంటి ఫాంట్లే. ఇవి ఉచితంగా లభించవు, కొనుక్కోవాలి. వీటిని డెస్క్ టాప్ పబ్లిషింగులో విస్తృతంగా వాడేవారు. ఇప్పటికీ వాడుతున్నారు. [[ఈనాడు]], [[ఆంధ్రజ్యోతి]] వంటి పత్రికల వారు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఫాంటులు వాడేవారు. ఆ పత్రికలు చదవాలంటే ఆ వెబ్సైట్లలో వాళ్ళ ఫాంట్లను పాఠకుల కంప్యూటర్ల లోకి
తెలుగు ఫాంట్లు అప్పటికి ఇంకా అందుబాటు లోకి రాలేదు. మొదటి తెలుగు ఫాంటు పోతనను తిరుమల కృష్ణ దేశికాచారి సృష్టించాడు. అయితే ఇది ISO-8859-1 ఎన్కోడింగు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున వెబ్పేజీల్లో వాడే వీలు లేకపోయింది. జువ్వాడి రమణ దాన్ని సవరించి తిక్కన 1.0 అనే పేరుతో విడుదల చేసాడు. కానీ అందులో కొన్ని తీవ్రమైన లోపాలు ఉండటాన, దాన్ని చోడవరపు ప్రసాదు, జువ్వాడి రమణలు సవరించి తిక్కన 1.1 గా విడుదల చేసారు.<ref>{{Cite web|url=http://www.ghantasala.info/help/tikkana_help.html|title=తిక్కన ఫాంట్స్|website=www.ghantasala.info|url-status=live|archive-url=https://web.archive.org/web/20220102214953/http://www.ghantasala.info/help/tikkana_help.html|archive-date=2022-01-27|access-date=2022-01-27}}</ref>
మొదట్లో తెలుగు వెబ్సైట్లలో తెలుగు చూడాలంటే, ఆ సైటు నుండి ఫాంట్లను దించుకోవాల్సి వచ్చేది. ప్రతి సైటు అలా లింకు ఒకటి ఇచ్చేవారు. ఫాంటు దింపుకునే అవసరం లేకుండానే తెలుగు చూడగలిగే
== మూలాలు ==
|