భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 63:
పరిపాలన విధానం 1858 జూన్ 28లో బ్రిటిషు [[ఈస్టిండియా కంపెనీ]] పాలన [[విక్టోరియా రాణి]] సింహాసనానికి మారినప్పుడు ఏర్పాటయింది. <ref>{{cite web|last = Kaul|first = Chandrika|title = From Empire to Independence: The British Raj in India 1858–1947|url = http://www.bbc.co.uk/history/british/modern/independence1947_01.shtml|accessdate = 3 March 2011}}</ref> (1876లో అదే [[విక్టోరియా రాణి]]ని భారతదేశపు చక్రవర్తిగా ప్రకటించారు), బ్రిటిషు ఇండియా సామ్రాజ్యం [[యూనియన్ ఆఫ్ ఇండియా]] (తర్వాతి కాలంలో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా), డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్ (తదనంతర కాలంలో [[ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్]], దానిలోని తూర్పుభాగం మరింత తర్వాతి కాలంలో [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌]] అయింది), [[డొమినియన్ ఆఫ్ సిలోన్]] (ప్రస్తుతం [[శ్రీలంక]]), [[సిక్కిం]] (ప్రస్తుతం భారతదేశంలో భాగం)గా ఐదు సార్వభౌమ రాజ్యాలుగా 1947లో విభాజితమయ్యే వరకు కొనసాగింది. 1858లో బ్రిటిషు రాజ్ ఆరంభమయ్యేనాటికే దిగువ బర్మా బ్రిటిషు పాలనలో భాగంగా వుంది. 1886 లో  ఎగువ బర్మా చేర్చారు. దాంతో బర్మాను 1937 వరకూ స్వయంపాలిత విభాగంగా నిర్వహించారు. తర్వాత అదొక ప్రత్యేక బ్రిటిషు కాలనీగా స్వాతంత్ర్యాన్ని పొందడం ప్రారంభమై చివరకు 1948లో బ్రిటిషు [[మయన్మార్]] బర్మాగా రూపాంతరం చెందింది.
 
== భౌగోళిక  పరిధి ==
బ్రిటిషు రాజ్ [[గోవా]], [[పాండిచ్చేరి]] వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి [[భారతదేశం]], [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]] ప్రాంతాలలో విస్తరించింది.<ref name="British India geography">{{cite web|title = The Geography of British India, Political & Physical (1882)|url = https://archive.org/details/geographybritis00smitgoog|website = Archive.org|publisher = UK Archives|accessdate = 2 August 2014}}</ref> దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటిషు సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి. 1937 నుంచి  బర్మా  భారతదేశం  నుంచి  విడివడి 1948లో స్వాతంత్ర్యం పొందేంతవరకూ నేరుగా బ్రిటిషు రాణి పాలన కిందకు వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌కు చెందిన  ట్రూషియల్  రాజ్యాలు  సైద్ధాంతికంగా  ప్రిన్స్ లీ స్టేట్స్,  1946 వరకూ  ఇవి బ్రిటిషు ఇండియాలో భాగం, రూపాయిని వారి మారకద్రవ్యంగా (కరెన్సీ) వాడేవారు.<ref>{{cite book |author = Subodh Kapoor|title = The Indian encyclopaedia: biographical, historical, religious ..., Volume 6|publisher = Cosmo Publications|date = January 2002|page = 1599|url = http://books.google.co.in/books?id=q5ZM0nZXZEkC&pg=PA1599|isbn = 81-7755-257-0}}</ref> ఈ ప్రాంతానికి చెందిన ఇతర దేశాల్లో, సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక) 1802లో అమైన్స్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ పాలన కిందికి వచ్చింది.1793 నుంచి 1798 వరకు సిలోన్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం.<ref name="codringtonch10">Codrington, 1926, Chapter X:Transition to British administration</ref> [[నేపాల్]], [[భూటాన్]] రాజ్యాలు, బ్రిటిషు వారితో యుద్ధాలు చేసి, తదనంతరం వారితో ఒప్పందాలు సంతకం చేసి, బ్రిటిషు వారి నుంచి స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.<ref>[http://www.britannica.com/eb/article-23632 "Nepal."]</ref><ref>[http://www.britannica.com/eb/article-25008 "Bhutan."]</ref> 1861 లో  జరిగిన [[ఆంగ్లో సిక్కిమీస్ ఒప్పందం]] అనంతరం సిక్కిం రాజ్యానికి ప్రిన్స్ లీ స్టేట్  హోదా దక్కింది, అయితే సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం నిర్ధారించకుండా విడిపెట్టారు.<ref>"Sikkim."</ref> మాల్దీవులు  1887 నుంచి 1965 వరకూ బ్రిటిషు సంరక్షిత ప్రాంతంగా ఉంటూవచ్చినా బ్రిటిషు ఇండియాలో  భాగం కాలేదు.
 
== ఆర్థిక పరిధి ==
1780లో కన్సర్వేటివ్ వర్గానికి చెందిన బ్రిటిషు రాజకీయవేత్త [[ఎడ్మండ్ బర్క్]] భారతదేశం స్థితిని గురించిన అంశాన్ని ముందుకుతెచ్చారు, [[వారన్ హేస్టింగ్స్]], ఇతర ఉన్నతాధికారులు భారతీయ సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థని నాశనం చేశారంటూ తీవ్రంగా ఈస్టిండియా కంపెనీపై దాడిచేశారు.  భారతీయ చరిత్రకారుడు [[రాజత్ కాంత రాయ్]] (1998) ఈ దాడిని కొనసాగిస్తూ, 18వ శతాబ్దంలో బ్రిటిషర్లు తీసుకువచ్చిన కొత్త ఆర్థికవ్యవస్థ దోపిడీ అనీ, సంప్రదాయ మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థకు మహా విపత్తు అనీ పేర్కొన్నారు.<ref name="British expansion in India">{{cite web|title = Britain in India, Ideology and Economics to 1900|url = http://www.fsmitha.com/h3/h50imp2.htm|website = Fsmitha|publisher = F. Smith|accessdate = 2 August 2014}}</ref> బ్రిటిషు పాలన ప్రారంభమయ్యాకా ధనం, ఆహారాల నిల్వలు తరిగిపోవడం, అత్యంత తీవ్రస్థాయిలో పన్నులు విధించడాన్ని విమర్శిస్తూ, తుదకు బెంగాల్‌లో మూడోవంతు జనం మరణించడానికి కారణమైన 1770లో వచ్చిన దారుణమైన బెంగాల్ కరువుకు దారితీశాయని రాయ్ ప్రతిపాదించారు.<ref>Rajat Kanta Ray, "Indian Society and the Establishment of British Supremacy, 1765–1818", in ''The Oxford History of the British Empire'': vol. 2, "The Eighteenth Century" ed. by P.</ref> ఇటీవలి పరిశోధనల్లో ఈ విషయాన్ని పునర్వ్యాఖ్యానిస్తూ [[పి.జె.మార్షల్]] మునుపటి సంపన్న, నిరపాయకరమైన మొఘల్ పాలన పేదరికం, అరాచకత్వాలకు దారితీసిందని చూపారు.<ref name="Impact of British Rule">{{cite web|title = IMPACT OF BRITISH RULE ON INDIA: ECONOMIC, SOCIAL AND CULTURAL (1757–1857)|url = http://www.nios.ac.in/media/documents/SecSocSciCour/English/Lesson-05.pdf|website = Nios.ac.uk|publisher = NIOS|accessdate = 2 August 2014}}</ref>