శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
వాగ్గేయకారులూ దేవిని అంబ,వారాహి,వైష్ణవీ,శారదా,అఖిలాండేశ్వరి,వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు.ఆరాధకుడైన కవి కాళిదాసుసే ఆరాధించ బడిన కాళి .కవులచే ఆరాధించబడిన శరదాంబ, వీరిలో కొందరు.ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ,జలంధర పీఠవాసిని,శ్యామాశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.
==శక్తి ప్రాధానిక నగరాలు==
*ముంబాయి;-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
*బాసర;-సరస్వతీదేవి ఈ దేవికి ప్రత్యేక ఆలయం అనేకంగా బాసర మాత్రమే.
*మధుర;-మీనాక్షీ బహుసుందర ఆలయం.
*కంచి;- శంకరాచార్య పీఠం ఉన్న క్షేత్రం.ఇక్కడ దేవి కామాక్షీ పేరుతో ఆరాధించబడుతుంది.
*కన్యాకుమారి;-ఇక్కడ దేవి కన్యాకుమారి.ఆమె ముక్కు పుడక ప్రసిద్ధి.నావికులు ఆ ముక్కు పుడక కాంతిని చూసి భరతఖండం వచ్చినట్లు గుర్తిస్తారని *ప్రతీతి.ప్రస్తుతం ముక్కు పుడక కనపడకుండా చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది.
*పొద్దుటూరు;-ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి.ఈ దేవి వైశ్యుల చేత మాత్రమే పూజింపబడుతుంది.
*కొల్లేరు;-కోల్లేటి సరసు మద్య భాగంలో ఉన్న కొల్లేటి కోటలో దేవి పెద్దింటమ్మగా ఆరాధించబడుతుంది.
*శృంగేరి;- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం.శంకరాచార్యులు ఇకడ శారడాంబికను చందనమూర్తిగా ప్రతిష్టించారు.తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్టించబడింది.ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది.తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
*సమయపురం;-
*మేల్మరువత్తూర్;-తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న మేల్‌మరువత్తూరులో దేవి ఆదిపరాశక్తిగా ఆరాధించబడుతుంది.ఇక్కడ విద్యా,వైద్య సేవలు దేవీ పేరుతో అందిస్తారు.ఇక్కడకు స్త్రీలు తమిళ ఆషాడమాసంలో దీక్షతీసుకుని ఎర్రటి వస్త్ర ధారణ చేసి దేవిదర్శనానికి వస్తారు.
*ఉజ్జయినీ;-ఇది శక్తి పీఠాలలో ఒకటి.ఈ నగర పూర్వనామం అవంతి అని జైన మతరాజైన సుధన్యుడు ఈ నగరాన్ని ఉజ్జయినిగా మార్చాడనితను హిందూమతానికి మారాడనీ అయినా పేరు మాత్రం అలా మిగిలి ఉందనీ ప్రతీతి.ఇక్కడ దేవి కాళిమాతగా ఆరాధించ బడుతుంది.మహాకవి కాళీదాసు
కాళిమాతను ఇక్కడే ఆరాధించాడని స్థల పురాణం చెప్తుంది.ఇక్కడ తాత్రిక పూజలు జరుగుతుంటాయి.
*యాగంటి;-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది .ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి.పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా సంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని
ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు