కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 39:
 
== ఎఐసీసీ సారథ్యం ==
[[1977]]లో జరిగిన [[లోక్ సభ]] ఎన్నికలలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] అధ్యక్ష పదవికి పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ కాంగ్రెసు నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించాడు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకడు. ఓటమి పిమ్మట, పతనావస్థధలోపతనావస్థలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పనిచేసాడు. తదనంతరం [[ఇందిరాగాంధీ]]తో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి [[ఇందిరాగాంధీ]] నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. [[1978]] లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసును [[1980]] లో ఇందిరాకాంగ్రెసులో విలీనం చేశాడు.
 
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==