చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
==అభిప్రాయాలు==
 
"చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యంతెలుసుకొన్నట్లే. అసలు జీవితానికి అర్ధం ఏమై ఉంటుంది?" లాంటి ప్రశ్నతోవాక్యాలతో ఈ నవల మొదలవుతుంది. .. జీవిత రహస్యం తెలుసుకొనే తపనలో దయానిధికి ఒక సత్యంఅర్ధమవుతుంది. "మనిషికి కావలిసింది కాసింత దయ" అని బుచ్చిబాబు ఈ నవల ద్వారా చెప్పదలచుకొన్నాడు<ref>[http://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=40 AVKF పుస్తకాల సైటులో పరిచయ వాక్యాలనుండి]</ref>
 
 
చివరకు మిగిలేది నవల ఏ ప్రశ్నతో మొదలయ్యిందో అదే ప్రశ్నతొ ముగిసి విశ్రాంతి పొందింది. .. బుచ్చిబాబు రచించిన ఒకే ఒక నవల "చివరకు మిగిలేది" ఓపెన్ ఎండింగ్ నవల. <ref name="vegunta">'''వేగుంట మోహన ప్రసాద్''' రేడియో ప్రసంగ వ్యాసం - [[శత వసంత సాహితీ మంజీరాలు]]లో ముద్రించబడింది.</ref>
 
 
బుచ్చిబాబు నవల శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన మీమాంస. కోమలి చవరికి తానున్న కుటీరపు దహనంలో, జ్వాలల్లో చిక్కుకుపోవడం, దయానిధి ఆమెను రక్షించడం, తనకు తోడుగా ఎటో తిసికెళ్ళి పోవడం కూడా దహన సంస్కారపు ఆత్మ సంస్కారంలోని భావమే. దయానిధి తల్లి శిలా విగ్రహం తల పగిలినా ఆమె పాదాలు ఇంకా నిలిచి ఉండడం ఈ సమాజపు సంస్కారంలో భాగమే. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోని మధ్య తరగతి మందహాసంలోని భాగస్థులే నిజాయితీ లేని దశరథ రామయ్య, గోవిందరావు, కృష్ణమూర్తి, జోగప్ప నాయుడు, గుర్నాధం, ప్రకాశరావు, అరూపానందస్వామి, శిష్యులు జీవ సజీవలు. మరీ ముఖ్యంగా రాజభూషణంలు. వారికి చివరికి మిగిలేదేమిటనే ప్రశ్నే రాదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నారన్న నౌకరే అయినా అతనికి దయానిధిపైనున్న ప్రేమ మిగిలింది. అనంతాచారికి ఆదరణ మిగిలింది. వైకుంఠానికి కృతజ్ఞత మిగిలింది. నవలలోని అగ్రవర్ణాలవాళ్ళు సుఖపడింది లేదు వాళ్ళ కృతక నీతివలన. నిమ్న వర్ణాలలోని కామాక్షి, కోమలులు ఇంతకంటే నష్టపోయేది ఏమీ లేదు. జగన్నాధం కృతకమైన తెలుగులో మాట్లాడుతాడు. ఆ వెక్కిరింపు సమాజం పట్లనే. అతనే గనుక సహజమైన భాషలో మాట్లాడి ఉంటే దయానిధి అస్తిత్వ వేదన అతన్ని కాల్చేసేది. '''చివరికి మిగిలేది''' నవలలో మాతృ ప్రేమ, స్వీయ ప్రేమల వికృతులు చివరికి ద్వేష రాహిత్యంలో ప్రేమ సాఫల్యాన్ని పొంది విశ్రాంతనొందిన నవల. <ref name="vegunta"/>