కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (34), typos fixed: ) → )
పంక్తి 2:
| name = కుమారజీవుడు
| image =
| birth_date = క్రీసా.శ. 344
| image_size = 200px
| caption = ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు
| birth_place = కూచా, [[చైనా]]
| death_date = క్రీసా.శ. 413
| death_place = చాంగన్, [[చైనా]]
| religion = [[బౌద్ద మతం]]
పంక్తి 23:
[[File:Kumarajiva at Kizil Caves, Kuqa.jpg|400px|thumb|కూచా నగరానికి 30 కి.మీ. దూరంలో గల కిజిల్ గుహల ప్రవేశప్రాంగణంలో నిర్మితమైన కుమారజీవుని స్మారక విగ్రహం]]
==ఆధార గ్రంధాలు==
కుమారజీవుని జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు Kao seng techoam (2 వ భాగం) (క్రీసా.శ. 519), Tch’ou san tsang ki si (క్రీసా.శ. 520), Chi-mo-lo-shi మొదలగు చైనా గ్రంథాలలో విపులంగా పేర్కొనబడింది.
 
==కుటుంబ నేపథ్యం==
పంక్తి 37:
 
==మహాయాన బౌద్దంలోనికి కుమారజీవుడు==
[[Image:Tarimbecken 3. Jahrhundert.png|thumb|300px|క్రీసా.శ. 4 వ శతాబ్దంలో తారిమ్ బేసిన్ (చైనా) లో ఏర్పడిన కూచా, కాష్గర్, తుర్పాన్ తదితర మద్య ఆసియా రాజ్యాలు]]
కూచా రాజ్యానికి [[ఈశాన్యం|ఈశాన్య]] సరిహద్దులలో వున్న తుర్పాన్ రాజ్యంలో 10 వేలకు పైగా బౌద్ధ సన్యాసులు వుండేవారు. కుమారజీవుడు దాదాపుగా ఇక్కడ ఉంటున్న సమయంలోనే కుమారజీవుని ధర్మపధం మహాయానం వైపు నడిచింది. ఒకప్పుడు యార్కండ్ (Yarkand) రాకుమారుడు తరువాతి కాలంలో మహాయాన బౌద్ధసన్యాసిగా మారిన సుత్యసోముని ప్రభావం కుమారజీవునిపై గాఢంగా పడింది. అతని ప్రభావం వల్ల కుమారజీవుడు శూన్యవాదం వైపు ఆకర్షించబడ్డాడు. సుత్యసోముని ఉపదేశంతో కుమారజీవుడు మహాయాన బౌద్ధసూత్రాలని ఆకళింపు చేసుకొన్నాడు.
 
పంక్తి 47:
 
==చైనాలో నిర్భందం – విడుదల==
కుమారజీవుని రాకకై వేగిరపడిన చైనా చక్రవర్తి యొక్క ఆజ్ఞ మేరకు అతని సేనాధిపతి జనరల్ ‘లుగుయాంగ్’ (Gen. Lu Guang) క్రీసా.శ. 383 లో కూచా రాజ్యంపై దాడిచేసి రాజుని చంపి కుమారజీవుని బంధించాడు. బంధించబడే నాటికి కుమారజీవుని వయస్సు 40 సంవత్సరాలు. ఇదే సమయంలో ఉత్తర చైనా రాజ్యంలో అంతర్గత రాజకీయ పోరు సంభవించింది. కిన్ వంశానికి చెందిన పాత చక్రవర్తి చంపబడటం, యావో వంశానికి చెందిన కొత్త చక్రవర్తి అధికారంలోకి రావడం జరగడంతో సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ తన విధేయతను మార్చుకొని స్వతంత్రం ప్రకటించుకొన్నాడు. యుద్ద ఖైదీ అయిన కుమారజీవుని చక్రవర్తి వద్దకు పంపకుండా తన రాజధాని ‘లియాంగ్ గ్జౌ’ (Liangzhou) లో తన వద్దనే 16 సంవత్సరాలుకు పైగా బందీగా వుంచుకొన్నాడు. ఈ బందీ పరిస్థితులలోనే కుమారజీవుడు చైనా భాషను నేర్చుకొనడం జరిగింది. తదనంతరం రెండవ చక్రవర్తి అయిన యావో జింగ్ (Yao Xing) తన సేనాధిపతి జనరల్ లుగుయాంగ్ ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణికి విసిగిపోయి క్రీసా.శ. 401 లో అతనిపై దాడి చేసి ఓడించి కుమారజీవుని సురక్షితంగా విముక్తి చేసి తన రాజధాని చాంగన్ కు రప్పించుకొన్నాడు. ఈవిధంగా చైనా అంతర్గత [[రాజకీయాలు|రాజకీయ]] పోరులో నలిగిపోయిన కుమారజీవుడు క్రీసా.శ. 384 నుండి 401 వరకు 16 సంవత్సరాలకు పైగా అకారణంగా బందీయై మగ్గిపోవలసి వచ్చింది.
 
==చాంగన్ నగరంలో కుమారజీవుడు==
[[image:White Horse Pagoda, Duhuang.jpg|thumb|చైనాకు బౌద్ద గ్రంథాలను చేరవేస్తూ మరణించిన తన అశ్వానికి స్మారకంగా కుమారజీవుడు దుహాంగ్ లో నిర్మించిన White Horse Pagoda]]
16 సంవత్సరాల సుదీర్ఘ బందనం నుంచి విముక్తుడై క్రీసా.శ. 401 లో రాజధాని చాంగన్ (ప్రస్తుత Xian, చైనా) లో అడుగుపెట్టిన కుమారజీవునికి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీసా.శ. 366 - 416) నుండి అఖండ ఆదరణ లభించింది. చక్రవర్తి అతనిని జాతీయ [[గురువు]] (National Perceptor) గా నియమించడమే కాక రాజ గురువుగా స్వీకరించి గౌరవించాడు. బౌద్ధ సూత్రాలను, సారస్వతాన్ని చైనా భాషలోనికి అనువదించడంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా చక్రవర్తి అతనిని కోరాడు.
 
బౌద్ద పరిభాషను, బుద్ధుని యథార్థ బోధనలను అర్థం చేసుకొంటూ, మూల సంస్కృత బౌద్ద గ్రంథాలలోని భావాన్ని, తత్వాన్ని అనువాదంలో స్పష్టంగా వ్యక్తం చేయాలంటే, చైనా అనువాదకునిగా స్థానిక తావో (Taoism) తాత్విక ప్రభావానికి గురికాని విదేశీ బౌద్ద సన్యాసి అవసరమవుతుంది. అప్పటికే కుమారజీవుడు మద్య ఆసియాలో అత్యంత ప్రముఖ ఆచార్యుడిగా పేరు పొందాడు. పైగా [[పాళీ భాష|పాళీ]], [[సంస్కృతము|సంస్కృత]] భాషలలో దిట్ట, మహాయాన బౌద్ద్దంలో కూడా పండితుడు కావడం, బౌద్ద తత్వాన్ని, ధర్మాన్ని విశిదీకరించడంలో అతనికున్న సాధికారత, అపార ప్రజ్ఞా పాటవాలు ఈ అంశాలన్నీ చైనా చక్రవర్తి కుమారజీవుని అనువాద కార్యానికి నాయకత్వం వహించవలసిందిగా కోరడానికి దారితీసాయి.
పంక్తి 57:
అప్పటికే టావోన్ (Tao-on) అనే బౌద్ద సన్యాసి కృషితో చాంగన్ నగరంలో ఒక అనువాద కేంద్రం నెలకొల్పబడింది. చక్రవర్తి ఆదరణ పుష్కలంగా ఉండడంతో, ఉత్సాహపరులైన బౌద్ద సన్యాసుల, అనువాదకుల సహకారంతో ఈ అనువాద కేంద్రంలో పని ప్రారంభించిన కుమారజీవుడు [[సంస్కృతము|సంస్కృత]] భాషనుండి అనేక ప్రామాణిక బౌద్ద గ్రంథాలను చైనా భాషలోనికి అనువదించాడు. కొత్త అనువాదాలనే కాక పాత అనువాదాలను సమీక్షించి, పునః పరిష్కరించడం కూడా చేసాడు.
 
ఉత్తర చైనా రాజధాని చాంగాన్ లో అనువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు కుమారజీవుని ఖ్యాతి దక్షిణ చైనా రాజ్యానికి కూడా ప్రాకింది. దక్షిణ చైనా బౌద్దసంఘ నాయకుడైన ‘హ్యు యువాన్’ (Hui-Yuan) కుమారజీవునితో బౌద్ద తత్వంపై, ఆశ్రమ విషయాలపై చర్చిస్తూ కుమారజీవుని అనువాద కృషిని ప్రోత్సాహించేవాడు. ఇతని కోరికపై కుమారజీవుడు ధర్మ కాయానికి, ధర్మధాతుజ కాయానికి మద్య గల భేదాన్ని విశిదీకరించినట్లు తెలుస్తుంది. ఒకానొక దశలో కుమారజీవుడు తన స్వస్థలమైన కూచా రాజ్యానికి వెళ్లిపోదలుచుకొన్నాడన్న వార్త విని అతనిని చైనాలోనే వుండిపోవలసిందిగా హ్యు యువాన్ కుమారజీవుని తీవ్రంగా అభ్యర్థించాడు. హ్యు యువాన్ తో కుమారజీవుడు జరిపిన 18 ఉత్తర ప్రత్య్త్తత్తరాలు చారిత్రిక ప్రాధాన్యం కలిగివున్నాయి. అనువాదకుడుగా చాంగన్ లో స్థిరపడిన కుమారజీవుడు క్రీసా.శ. 413 లో తను మరణించే వరకూ 12 సంవత్సరాల పాటు చైనా లోనే నివసించాడు.
 
==కుమారజీవునికి ముందు కాలంలో చైనీయుల అనువాదాల స్థితి==
పంక్తి 73:
 
==కుమారజీవుడు అనువదించిన ముఖ్య బౌద్ధ గ్రంధాలు==
కుమారజీవుడు క్రీసా.శ. 401 లో రాజధాని చాంగన్ లో అడుగుపెట్టినప్పటినుండి తను మరణించేవరకు (క్రీసా.శ. 413) 12 సంవత్సరాల పాటు బృహత్తర అనువాద కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషి చేసి 384 వాల్యూంలతో కూడిన 74 బౌద్ధ గ్రంథాలను చైనా భాష లోనికి అనువాదం చేసాడు. అనేక బౌద్ద సూత్రాలను, వ్యాఖ్యలను ముఖ్యంగా మహాయానానికి చెందిన ప్రజ్ఞాపారమిత సాహిత్యాన్ని అనువదించాడు. కుమారజీవుడు అనువదించిన ప్రామాణిక బౌద్ద గ్రంథాలలో కొన్ని
 
# సత్య సిద్ది శాస్త్ర – 20 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 402-412 ల మద్య కాలంలో)
# అష్ట సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర - 10 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 408 లో)
# వజ్రచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర (The Diamond Sutra) – 1 వాల్యూమ్ – (క్రీసా.శ. 402-412 ల మద్య కాలంలో)
# సద్దర్మ పుండరీక సూత్ర (The Lotus Sutra) - 8 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 406 లో)
# లఘు సుఖావతి వ్యూహ (అమితభ సూత్ర) – 1 వాల్యూమ్ – (క్రీసా.శ. 402 లో)
# మాద్యమిక శాస్త్ర – 4 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 409 లో)
# శతక శాస్త్ర – 2 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 409 లో)
# ద్వాదశముఖ శాస్త్ర – 1 వాల్యూమ్ – (క్రీసా.శ. 409 లో)
# సర్వాస్థివాద వినయ – 61 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 404-409 ల మద్య కాలంలో)
# మహా ప్రజ్ఞాపారమిత ఉపదేశ – 100 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 402-405 ల మద్య కాలంలో)
# పంచవింశతి సహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్ర – 27 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 404 లో)
# విమలకీర్తి నిర్దేశ సూత్ర - 3 వాల్యూమ్స్ – (క్రీసా.శ. 406 లో)
# కరుణికరాజ ప్రజ్ఞాపారమిత సూత్ర - 2 వాల్యూమ్స్
# మైత్రేయ వ్యాకరణ సూత్ర – 1 వాల్యూమ్
పంక్తి 99:
==చక్రవర్తి యావో జింగ్ తో కుమారజీవుని సత్సంబందాలు==
కుమారజీవుడు ఆనాటి ఉత్తర చైనా చక్రవర్తి యావో జింగ్ (Yao Xing) (క్రీసా.శ. 366 - 416) తో చక్కని స్నేహపూరితమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. కుమారజీవుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు, బౌద్ద ధర్మ వివరణలో అతనికున్న సాధికారత, చక్రవర్తిని అమితంగా ఆకర్షించాయి. బౌద్ద గ్రంథాల చైనా అనువాద ప్రక్రియలకు సమర్ధుడిగా అతనినే భావించిన చక్రవర్తి కుమారజీవుని శత్రు చెర నుంచి విడిపించి తన వద్దకు రప్పించుకొన్నాడు. జాతీయ గురువుగా గౌరవించడమే కాకుండా, రాజ గురువుగా ప్రకటించి తన ఆస్థానంలో అతని స్థాయిని అతి స్వల్ప వ్యవధిలోనే ఉన్నతీకరించాడు. అనువాద కేంద్రానికి నాయకుడిగా చేసి బృహత్తర అనువాద కార్యక్రమ బాధ్యతను కుమారజీవుని భుజ స్కంధాలపై నిలిపాడు.
 
అదేవిధంగా చక్రవర్తి చూపిన ఆదరణ, అందించిన తోడ్పాటు, అనువాదం పట్ల చక్రవర్తికి గల ప్రత్యేకాసక్తిని గమనించిన కుమారజీవుడు చక్రవర్తి అభిమతానికి అనుగుణంగా అనువాద కార్యక్రమాన్ని రాజధానికి చేరుకొన్న ఆరు రోజుల వ్యవధిలోనే ప్రారంభించాడు. తను మరణించేవరకూ 12 సంవత్సరాలపాటు నిరాఘాటంగా అసమాన కృషితో అనువాద యజ్ఞాన్ని కొనసాగించి చక్రవర్తి అభిమానానికి పాత్రుడయ్యాడు.కుమారజీవుని ప్రభావంతో చక్రవర్తి యావో జింగ్ తన రాజ్యంలో అనేక బౌద్దాలయాలు, నిర్మించాడు. కుమారజీవుని ప్రభావం వలన ఈ చక్రవర్తి కాలంలోనే బౌద్దమతానికి తొలిసారిగా రాజ మద్దతు లభించింది. ఫలితంగా కుమారజీవుని ప్రభావంతో ఇతని రాజ్యంలో 90 శాతం ప్రజలు బౌద్ధులుగా మారారని వర్ణించబడింది.
 
కుమారజీవుని ధార్మిక చింతన, [[ప్రతిభ]], ఆధ్యాత్మిక సంపన్నత చక్రవర్తిని ఎంతగా కదిలించాయంటే, సన్యాసి అయిన కుమారరజీవునికి సంతతి లేని కారణంగా, అతని అపూర్వ ప్రతిభా పాటవాలు అతనితోనే అంతరించిపోతాయనే దిగులు సైతం చక్రవర్తికి కలిగింది. ఫలితంగా ఆశ్రమజీవితం నుండి కుమారజీవుని తప్పించి ఒక అందమైన రాజ భవంతిలోకి తరలించాడు. ఆకర్షణీయమైన అంతఃపుర పడుచులను ఎన్నిక చేసి మరీ అతనికి పరిచారకులుగా నియమించి వారి ద్వారా ఉత్తమ సంతానం కలిగేటట్లుగా అనుకూల పరిస్థితులు కల్పించాడు. దీనితో బొద్ద సన్యాసిగా కుమారజీవునికి సంకట పరిస్థితి ఎదురైంది. ఒకవైపు చక్రవర్తి ఆజ్ఞ ధిక్కరిస్తే అనువాద కేంద్రం మూతబడవచ్చు. మరోవైపు పాటిస్తే సన్యాసిగా తన నియమ నిష్ఠకు భంగం వాటిలుతుంది. జాగ్రత్తగా ఆలోచించి చక్రవర్తి ఆజ్ఞకు తలవంచవలసి వచ్చింది. కొన్ని ఆధారాల ప్రకారం ప్రతికూల పరిస్థితుల ప్రభావానికి గురైన కుమారజీవుడు ఆశ్రమ జీవితం నుండి సాంసారిక జీవితానికి బలవంతంగా మళ్ళించబడ్దాడని, అతనికి సంతతి కలిగిందని తెలుస్తుంది. ఒకానొక సమయంలో అసలు సంగతులు తెలియని అతని గురువు 'విమలరక్ష' (క్రీసా.శ. 337 - 413) చైనాకు వచ్చినపుడు శిష్యుడైన కుమారజీవుని జీవనరీతిని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది. ఖిన్నుడైన కుమారజీవుడు గురువుతో తాను కర్మకు బందీ అయినవాడుగా, క్లేశానికి లోనైన వాడుగా వివరించి, గౌరవార్హతకు నోచుకున్నవానిగా తనకు తాను పరిగణించుకోవడం లేదని విన్నవించుకొన్నాడు. పశ్చతాపానికి లోనైన కుమారజీవుడు రాజ భవంతిలో భోగభాగ్యాల మద్య తులతూగవలసి వచ్చినప్పటికీ తన జీవన రీతిని ఒక బౌద్దాశ్రమ సన్యాసి జీవించే రీతిలోనే గడపడానికి చివరివరకు ప్రయత్నించాడు. బురద నుండి వెలువడిన పద్మం వలె తనను పోల్చుకొన్నాడు. తన శిష్యులతో, తన తోటి బౌద్దసన్యాసులతో తన జీవన రీతిని ఉద్దేశిస్తూ పద్మాన్ని మాత్రమే చూసి దానికి అంటిన బురదని పట్టించుకోవలదని కోరాడు. తన బోధనలలోని అంతిమ సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకొనమని, తన జీవన విధానాన్ని ఆదర్శంగా గ్రహించవద్దని తరచు కోరేవాడు. ఏది ఏమైనప్పటికి సమకాలీన బౌద్ద సమాజం కూడా అతని సంకట పరిస్థితిని అర్ధం చేసుకొన్నట్లే కనిపించింది. అనువాద కృషి అవాంతరాలు లేకుండానే చివరవరకూ కొనసాగింది.
==మరణం==
[[image:Kumārajīva sheli.JPG|thumb|కుమారజీవుని స్మారక పగోడా, Huxian ప్రాంతం - దీనిలోనే చితిజ్వాలలలో నాశనం కాకుండా మిగిలినిదిగా భావించబడిన కుమారజీవుని 'నాలుక' భద్రపరచబడింది.]]
క్రీసా.శ.413 లో తన 69 వ సంవత్సరంలో కుమారజీవుడు చాంగన్ నగరంలో మరణించాడు. సాంప్రదాయం ప్రకారం కుమారజీవుడు మరణశయ్యపై వున్నప్పుడు తన ఆంతరంగిక శిష్యులతో ‘తన శరీర దహనం (Cremation) అనువాదకుడిగా తన విజయాన్ని నిరూపిస్తుందని, తను చేసిన అనువాదంలో బౌద్ద ధర్మానికి విరుద్దంగా ఏమైనా లోపాలుంటే చితి జ్వాలలు తన పార్దివ దేహాన్ని ఆసాంతం దహించివేస్తాయని, తన అనువాదంలో లోపాలు లేనట్లయితే తన నాలుక (tongue) తప్ప మిగిలిన దేహం మాత్రమే దహించబడుతుంద’ని చెప్పినట్లు ప్రతీతి. అతని మరణానంతరం శిష్యులు దీనిని నిరూపించడానికి ప్రయత్నించగా ఒక్క నాలుక మాత్రమె నాశనం కాకుండా మిగిలివుందని శిష్యులు గ్రహించినట్లు తెలుస్తుంది.
 
చాంగాన్ లో మరణించిన కుమారజీవుని చైనీయులు భారతీయునిగానే భావించి భారతీయ ఆచారాల ప్రకారమే అతనికి దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారజీవుని కృషికి స్మారక చిహ్నంగా చైనాలోని ప్రాచీన చాంగన్ (Xian) నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో Huxian ప్రాంతంలో కుమారజీవ పగోడా నిర్మించి అతని అవశేషాలను (చితాభస్మాన్ని,చితిజ్వాలలలో నాశనంకాని నాలుక) భద్రపరిచారు.
పంక్తి 127:
 
==అనువాదకునిగా కుమారజీవుని విశిష్టతలు==
* [[పాళీ]], [[సంస్కృత భాష]] లలో వున్న మూల బౌద్ద గ్రంథాలు క్రీసా.శ. 2 వ శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకూ గల మద్య కాలంలో సుమారు 6, 000కు పైగా చైనా దేశంలోనికి తరలించబడి వుంటాయని ఒక అంచనా. 200 మందికి పైగా ప్రముఖ అనువాదకులు ఈ వేలాది గ్రంథాలను పాళీ/సంస్కృత భాషలనుండి చైనా భాషలోనికి అనువదించారు. వీరందరిలో క్రీసా.శ. 5వ శతాబ్దానికి చెందిన కుమారజీవుడు, 7వ శతాబ్దానికి చెందిన [[హుయన్ త్సాంగ్]]లు అత్యంత ప్రముఖ అనువాదకులుగా చరిత్రలో పేరుపొందారు. వీరిలో కుమారజీవుడు జన్మతా భారతీయుడు కానప్పటికీ భారతీయ సంతతి (Indian Origion) కి చెందిన వ్యక్తి. ముఖ్యంగా ఒకవైపు [[గౌతమ బుద్ధుడు|బుద్ధుడు]] జన్మించిన దేశంలో బౌద్దమత ప్రాభవం క్షీణిస్తున్న కాలంలోనే (మలి [[గుప్తుల]] కాలంలో), మరొవైపు విదేశాలలో ముఖ్యంగా చైనాలో బౌద్దమత గ్రంథాల అనువాదం ద్వారా బౌద్ద మత వికాసానికి ఎనలేని కృషి చేసినవాడు కుమారజీవుడు.
* కుమారజీవుడు అనువాద శైలిలోను, ప్రక్రియా విధానంలోను సమూలమైన మార్పులు ప్రవేశపెట్టాడు. భావానికి ప్రాధాన్యం ఇస్తూ మృదుప్రవాహ శైలిలో అనువదించాడు. కుమారజీవుని అనువాదాలు ప్రస్తుత కాల పరిస్థితులలో సైతం అధ్యయనం చేయడానికి అనుకూలంగా వున్నాయంటే అతని అనువాదం ఎంత సరళంగా భావస్ఫురితంగా వుంటుందో అర్ధమవుతుంది. అనువాద ప్రక్రియలో కుమారజీవుడు ప్రవేశపెట్టిన బృహత్తర సామూహిక కృషి కూడా అంతకు ముందు అనువాదాల క్రియలో ఎన్నడూ లేదు. అనువాద ప్రక్రియను నిరంతరం కొనసాగించడం కోసం సంస్థాగత యంత్రాంగాన్ని (Institutional Mechanism) ఏర్పాటుచేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో వందలాది స్వచ్ఛంద అనువాద సహాయకుల, సహకారాన్ని పొందగలిగాడు. అనువాద విధానాన్ని అనువాదకుల వ్యక్తిగత కృషి (individual effort) స్థాయి నుండి వ్యవస్థీకృత కృషి (organized effort) స్థాయికి తీర్చిదిద్ది తన తరువాతి అనువాదకులకు మార్గదర్శిగా నిలిచాడు.
* కుమారజీవుని చైనా అనువాదాలనుండే ఇంగ్లిష్ భాషతో పాటు ఇతర ప్రపంచ భాషలలోకి బౌద్ద గ్రంథాలు అనువదించబడ్డాయి. స్థవిరవాదుల, మహాయానుల సాహిత్యం మూల సంస్కృతంలో అలభ్యం అయినప్పటికీ ఇతని అనువాదాల నుండే అందలి విషయాలు బయటి ప్రపంచానికి తెలిసాయి. ఉదాహరణకు 'మాద్యమిక కారిక' అనువాద గ్రంథానికి అసలు సంస్కృత ప్రతి అలభ్యం అయినప్పటికీ కుమారజీవుని అనువాదం వల్లే అందలి విషయాలు బయటకి వెల్లడయ్యాయి. కుమారజీవుడు లేనట్లయితే కొన్ని గొప్ప మహాయాన గ్రంథాలు సంరక్షించబడకపోయి వుండవచ్చు.
పంక్తి 135:
 
* కుమారజీవుని అనువాదాల వల్లే అంతవరకూ చైనీయులకు తెలియని ప్రామాణిక బౌద్ద గ్రంథాలు (ముఖ్యంగా మహాయాన బౌద్ద గ్రంథాలు) అందుబాటులోకి వచ్చాయి. అంతేగాక బౌద్ద పరిభాషను స్పష్టం చేయడంలో, బౌద్ద తత్వ భావనలను విపులీకరించడంలో కుమారజీవుడు చూపిన అనన్యమైన ప్రతిభ చైనీయుల బౌద్ద తత్వంపై గాడమైన ప్రభావం చూపింది.
* కుమారజీవుని అనువాదాల వలన చైనాకు యథార్థ బౌద్ధతత్వం పరిచయమైంది. క్రీసా.శ.2 వ శతాబ్దం నుండి క్రీసా.శ. 5 వ శతాబ్దం వరకు వచ్చిన మొరటు అనువాదాలు చైనీయులకు బౌద్ద ధర్మం, తాత్వికత పట్ల సరైన అవగాహన కల్పించలేకపోయాయి. ఆ విధంగా బౌద్ద తాత్విక అంధకారంలో వున్న సామాన్య చైనీయులకు కుమారజీవుని అనువాద గ్రంథాలతో నూతన గవాక్షాలు తెరుచుకొన్నట్లయ్యింది. అసలైన బౌద్దతత్వం సామాన్యులకు చేరువవ్వడంతో చైనాలో (మహాయాన) బౌద్ద ప్రాభవం పరవళ్ళు తొక్కడం ప్రారంభమైంది. కుమారజీవుని అనువాద ప్రభావం వలన క్రీసా.శ. 5 వ శతాబ్దం నుండి చైనాలో బౌద్ధం ఒక విదేశీమతంగా ఇక ఏమాత్రం పరిగణించలేనంతగా చైనాలో అంతర్భాగమయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే క్రీసా.శ. 5 వ శతాబ్దానికి బౌద్ధం చైనీయులకు సజీవ ఆరాధ్య మతంగా మారిపోయింది.
* చైనాలో మహాయాన బౌద్దమత వికాసానికి కావలిసిన నేపథ్య ఆధార భూమికను కుమారజీవుడు తన అనువాదాల ద్వారా అందించాడు. మహాయానతత్వం పట్ల సాధికారత గల కుమారజీవుని నుంచి వచ్చిన అనువాదాలు చైనాలో మహాయాన బౌద్ధం వికసించడానికి మాత్రమే కాక తూర్పు ఆసియా దేశాలకు ([[వియత్నాం]], [[సింగపూర్]], [[కంబోడియా]] తదితర దేశాలకు) అక్కడినుంచి [[కొరియా]], [[జపాన్]] దేశాలకు సైతం వ్యాపించడానికి దోహదం చేసింది. తూర్పు ఆసియా దేశాలలో అనుసరిస్తున్న మహాయాన బౌద్ధానికి సంబంధించిన పారాయణ గ్రంథాలు కుమారజీవుని చైనా అనువాద గ్రంథాలను ఆధారంగా చేసుకొనే రూపు దిద్దుకొన్నాయి.
* అంతేగాక కుమారజీవుని కృషి చైనాలో బౌద్ద శాఖలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసాయి. అటువంటి బౌద్ద శాఖలలో ‘తియన్ తాయ్’ (Tien Tai) శాఖ, ‘సాన్ లున్’ శాఖ (Sanlun) లు ముఖ్యమైనవి. వీటిలో ‘సాన్ లున్’ శాఖ తూర్పు ఆసియా మాధ్యమిక శాఖగా, ‘త్రి శాస్త్ర’ శాఖ (Three Treatises) గా పేరుపొందింది. ఈ రెండు శాఖలకు ప్రధాన సాహిత్య పారాయణాలుగా కుమారజీవునిచే అనువదించబడిన [[మాధ్యమిక విద్య|మాధ్యమిక]] బౌద్ద సూత్రాలే ఉన్నాయి.
పంక్తి 153:
* Himalaya Calling: The Origins of China and India, World century publishing corporation, NJ 07601, USA
* Saints & Sages of Kashmire-T.N Dhar Kundan (A.P.H. Publishing Corporation, New Delh -2004)
* Some Aspects of Asian History and Culture –Upendra Thakur (Abhinav Publications –1986)
 
[[వర్గం:బౌద్ధ పండితులు]]
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు