ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
==మూలాలు, వనరులు==
 
'''[[కాశీయాత్ర చరిత్ర]]''' మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు గ్రంధంలో వీరాస్వామయ్య సమయానుచితంగా చెప్పన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఆ ఇప్పుడు పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
 
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.