|
|
==జీవితం==
[[బొమ్మ:mullapudi.jpg|right|thumb|120px|[[బాపు]]-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి]]
ముళ్ళపూడి వెంకటరమణ 1931 జూన్ 28న [[ధవళేశ్వరం]]లో జన్మించాడు. ఇతని అసలుపేరు '''ముళ్ళపూడి వెంకటరావు'''. తండ్రి పేరు సింహాచలం. గోదావరి ఆనకట్ట ఆఫీసులో పని చేసేవాడు. వారి పూర్వీకులు బరంపురం కు చెందినవారు. రమణ కుటుంబం గోదావరి ఒడ్డున ఒకమేడలోఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. కుటుంబం ఇబ్బందులలో పడింది. సాహసం చేసి అతని తల్లి కుటుంబంతో [[మద్రాసు]] వచ్చిందివెళ్ళింది. మద్రాసులో అక్కా బావల వద్ద చదువు మొదలుపెట్టిన రమణ 5, 6 తరగతులు మద్రాసు పి.ఎస్.స్కూలులో చదివాడు. 7,8 తరగతులు [[రాజమండ్రి]] వీరేశలింగం హైస్కూలులోను, ఎస్సెల్సీ ఆనర్స్ దాకా కేసరీ స్కూలులోను చదివాడు. పాఠశాల విద్యార్ధిగానే లెక్కలలోను, డిబేట్లు, వ్యాస రచనలోను ప్రతిభ చూపించాడు. హాబీగా పద్యాలు అల్లేవాడు. నాటకాలలో వేషాలు వేసేవాడు.
1945లో "బాల" పత్రికలో రమణ మొదటి పత్రికకథ "అమ్మ మాట వినకపోతే" అచ్చయ్యింది. అందులోనే "బాల శతకం" పద్యాలు కూడా అచ్చయ్యాయి. ఆ ఉత్సాహంతోనే "ఉదయభాను" అనే పత్రిక మొదలెట్టి తనే ఎడిటర్ అయిపోయాడు. మిత్రులతో కలిసి ఒక ప్రదర్శన నిర్వహించి, వచ్చిన డబ్బులతో [[సైక్లోస్టైల్]] మెషిన్ కొన్నాడు. ఆ పత్రికకు రమణ ఎడిటర్. చిత్రకారుడు బాపు. విషయ రచయిత మండలీకశాస్త్రి. ఆర్ధిక ఇబ్బందుల వలన ఎస్సెల్సీతో చదువు ఆపిన రమణ చిన్నా చితకా ఉద్యోగాలు చేశాడు. 1954లో ఆంధ్ర పత్రికలోపత్రిక డైలీలో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆంధ్రపత్రికలో పని చేసేటపుడే బుడుగు వ్రాశాడు. <ref name="mbs">'''[[బుడుగు]]''' పుస్తకం ముందుమాట "బుడుగు వెంకటరమణ ..." లో సంపాదకుడు ఎమ్బీయస్ ప్రసాద్ - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2001-2007 ఆరు ముద్రణలు) </ref>
==రచనలు==
|