అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
చి clean up, replaced: క్రీ.శ → సా.శ.
పంక్తి 1:
[[దస్త్రం:The Empire Needs Men WWI.jpg|thumb|మొదటి ప్రపంచ యుద్ధ పోస్టర్‌ - దీన్ని ఆర్థర్ వార్డ్లే, పార్లమెంటరీ రిక్రూటింగ్ కమిటీ రూపొందించింది. బ్రిటిష్ సామ్రాజ్యంలోని దేశాల పురుషులను బ్రిటిష్ సైన్యంలో చేర్చుకోవాలని కోరింది.]]
[['''అధినివేశ ప్రతిపత్తి]]'''ని ఇంగ్లీషులో Dominion Status అంటారు. ఇది 19 శతాబ్దములో [[బ్రిటిష్]] ప్రభుత్వము తమ నిరంకుశ పరిపాలనలోనుండిన వలసరాజ్యములు స్వరాజ్యముకావలెననికోరి ఆందోళన చేయుచున్న దేశములకు తమ సామ్రాజ్యములో భాగముగనే వుంచుతూ అనుగ్రహించే ఒక విధమైన ప్రజాపరిపాలనా పధ్దతి. అట్టి ప్రజాపరిపాలనా పద్ధతి ఫెడరల్ సంయుక్తరాజ్యాంగమందురు. స్వరాజ్యమే గాని, పూర్ణ స్వరాజ్యము కాదు. అట్టి అదినివేశ స్వరాజ్యమనే [[రాజ్యాంగము]] కలుగచేసిన యడల స్వపరిపాలన చేసుకునప్పటికినీ స్వరాజ్య జాతీయప్రభుత్వముతో పరిపాలింపబడు భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రరాజ్య సమ్మేళనములో నొకటైయుండెడిది. డొమీనియన్ అనగా రాష్ట్రము అని అర్దము చెప్పినప్పటికీ రాజ్యాంగ స్థితి, ప్రభుత్వాధికారమునొసగిన రాజ్యాంగ సంస్థను బట్టి డొమీనియన్ అను మాట కాలక్రమేణా కొంచెం మార్పుచెందినది. 1926 [[అక్టోబరు]] 26 తేదీన [[బ్రిటిష్ ప్రభుత్వము]] తమ రాజ్యప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో అధినివేశ ప్రతిపత్తి వలననే [[భారత దేశము|భారతదేశము]]యెక్క రాజ్యాంగమబివృధ్ధి కాగలదని వక్కాణించియున్నారు. 1926 లో సమావేశమైనబ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందు అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు వివిరింపబడియున్నవి. 1920 లో తిలక్ మరణించిన తరువాత కొంతకాలము దేశములో నెలకొనియున్న అనిశ్ఛలతమైనస్వరాజ్యభావముల కాలమందు 1927 లో [[మోతీలాల్ నెహ్రూ]] అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశములో చేసిన తీర్మానము ప్రకారము భారతరాజ్యాంగ ముసాయిదా (చిత్తు) తయారుచేయబడినదనీనూ అందులో ప్రస్తావించిన స్వరాజ్యము అప్పటిలో బ్రిటిష్ సామ్రాజ్యములోనున్న '''డొమీనియన్లు అనబడు దేశములు (DOMINIONS) కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశములందు గల స్వరాజ్య''' '''ప్రజాప్రభుత్వములాంటి సరిసమానస్తాయిని డొమీనియన్ స్టెటస్ (dominion status) ''' కావలెనని కోరబడినదని చరిత్రలో విశదమగుచున్నది.<ref>Macropedia Britannica vol 15th Edition(1984). Indian Sub-continent.Vol 9. pp 412.</ref> 1926-1931లో భారతదేశమును పరిపాలించిన వైస్రాయి, [[లార్డు ఇర్విన్]] ప్రభువు అప్పటిలో ఉదృతముగా ప్రబలుతున్న స్వరాజ్య కాంక్షకు సానుభూతిగనూ, కొంత ఉపశమనము కలుగచేయుటకునూ అవలంబించిన [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]]తో భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ ఇవ్వబడవచ్చునను ఆశాచూపెట్టెను. ఆ కాలమందు తెలుగు ప్రాంతములలో మేధావులు రాజనీతిజ్ఞలును ఆ ఇంగ్లీషు పదమైన డొమీనియన్ స్టేటస్ కు [[తెలుగు]]సేతగా అధినివేశ స్వరాజ్యమని చెప్పిరి.<ref name = "ది.వేం.శి(1933)">"అదినివేశ స్వరాజ్యము" దిగవల్లి వేంకట శివరావు, [[చెరుకుపల్లి వెంకటప్పయ్య]] (1933) విజ్ఞానచంద్రికామండలి ప్రచురణ 40. ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ</ref>
 
==1919 సంవత్సరములో భారతదేశమునకు అధినివేశ ప్రతిపత్తి (Dominion Status)వచ్చునన్న తలపులకు అంకురార్పణ==
పంక్తి 12:
 
=== బ్రిటిష్ వలసరాజ్యముల చరిత్ర ===
భారతదేశము 18వ శతాబ్దం మద్య బ్రిటిష్ వలసరాజ్యముగా (బ్రిటిష్ ఇండియా) కొన్ని పరగణాలతో ప్రాారంభమై క్రమేణా దేశం మొత్తం 19వ శతాబ్దమునకు బ్రిటిష్ వలసరాజ్యమైనది. అంతకన్నా ముందే క్రీసా.శ. 15-16 శతాబ్దములనాటికే చాలా దేశములు బ్రిటిష్ వలస రాజ్యములుగా నుండి బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనలోనుండెడివి. అట్టిదేశములగు [[కెనడా]], [[న్యూజిలాండ్]], [[ఆస్ట్రేలియా]], [[దక్షిణాఫ్రికా]], [[న్యూఫౌండ్లాండ్]] మున్నగు దేశములను బ్రిటిష సామ్రాజ్యమునకు డొమీనియన్లుగా ఘోషించి వాటికి 19 -20 శతాబ్దములలో బ్రిటిష్ వారు స్వరాజ్యపరిపాలన కలుగచేసి సామ్రాజ్యమకుటములోనుండినటుల అనుగ్రహించి రాజ్యాంగము కలుగచేసి అదినివేశ స్వరాజ్యములుగా (డొమీనియన్లు) చేశారు. అటువంటి డొమీనియన్లలో కెనడా, [[న్యూజిలాండ్]] మొట్టమొదటగా ఘోషించబడ్డ బ్రిటిష్ డొమీనియనులు (అదినివేశ స్వరాజ్యములు). అందుచే చాలాకాలము దాకా ఆ రెండుదేశముల పేర్లు [[కెనడా డొమీనియన్]] [[న్యూజిలాండ్ డొమీనియన్]] అనబడుతూవుండేవి. తరువాత డొమీనియన్లుగా ఘోషించిన దేశముల పేర్లకు డొమీనియన్ అను మాటను జతచేసివుండలేదు. అనేక దేశములు బ్రిటిష్ వలసరాజ్యముగా మారిన [[చరిత్ర]] చూడగా బ్రిటిష్ ప్రభుత్వము సరాసరి ఇతరదేశములను ముట్టడించి వలసరాజ్యములుగా చేసుకునివుండలేదు. బ్రిటిష్ దేశ ప్రజలు 15-16వ శతాబ్దమునుండి వృత్తిరీత్య, జీవనాధారము రీత్య ఇతరదేశములకు వలసపోయి అక్కడె స్థిరపడియుండినవారికి వారిదేశీయుల [[రక్షణ]], సంక్షేమముల కొరకు బ్రిటిష్ ప్రభుత్వము ఆయాదేశములలో పరిపాలనా యంత్రాంగములను స్థాపించి (colonies) క్రమేణ ఆ దేశములను వలసరాజ్యములుగా పరిగణించారు. బ్రిటిష్ ప్రజలు ఇతరదేశములకు వలసకు పోయినవారిని బ్రిటిష్ ప్రభుత్వము వారు వారి రాజప్రతినిధులను పంపి క్రమేణారాజ్యపాలనాధికారములు చేపట్టి ఆ దేశములను పరిపాలించుటకు సైనిక సహాయంతో గవర్నర్లను నియమించి సుస్థిర వలసరాజ్యములు స్థాపించారు. పైనచెప్పిన దేశములు భారతదేశముకన్నాచాల ముందుగనే బ్రిటిష్ వలసరాజ్యములుగా నుండిన దేశములు. అవి 19-20 శతాబ్దములలో అధినివేశ స్వరాజ్యాములుగా అయినవి. 1940 నాటికి ఇండియా [[పాకిస్తాన్]] కూడా అదినివేశ స్వరాజ్యములుగ పరిగణింప బడినవి.
 
=== అధినివేశ ప్రతిపత్తిలు===
1926 లో సమావేశమైన బ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందును, 1931 సంవత్సరపు వెస్టుమినిస్టర్ చట్టమునందును వివరించబడిన అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు ఉల్లేఖన <ref name="ది.వేం.శి(1933)"/> <br> (1) "బ్రిటిష్ దీవులును, అధినివేశ ప్రతిపత్తిలు ఆంగ్లరాజుయొక్క మకుటమునెడల భక్తిమాత్రముచేతనే సంశ్లిష్టత గలిగి యుందురు". బ్రిటిష్ దీవులును, అధినివేశ ప్రతిపత్తిలు సామ్రాజ్యములో సరిసమానమైన భాగములు <br> (2) "తమ ఆంతరంగిక వ్యవహారమందుగాని విదేశ వ్యవహారములందుగాని ఏవిధముగను ఒకదాని కింకొటి లోబడవలసిన పనిలేదు" <br> (3) "ఇవి స్వపరిపాలన గల జన సమూహములు" <br> (4) "సామ్రాజ్యమునందు స్వపరిపాలనముగల ప్రతి రాజ్యాంగమును తన పరిణామమునకు తానే కర్త. స్వరూపము గాకపోయినను స్వభావమునుబట్టి దాని కెట్టి నిర్బంధమును లేదు". <br>
 
పై చెప్పిన లక్షణములకలిగిన స్వరాజ్యములు అధినివేశ స్వరాజ్యములు. వాటియొక్క రాజ్యాంగ విధానము బ్రిటిష్ దీవులలో గల ప్రజాప్రభుత్వములాంటివే. భారతదేశము 1931లో అధినివేశ స్వరాజ్యమైయుంటే పార్లమెంటు అను ప్రజాప్రభుత్వ సంస్థ నెలకొనియుండి బ్రిటిష్ రాజ్యప్రతినిధిగానున్న గవర్నర్ జనరల్ (వైస్రాయి) బ్రిటిష్ సార్వభౌముని రాజరికమునకుచిహ్నముగా కొనసాగుతూనుండెడివాడు.