గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
[[మద్రాసు క్రైస్తవ కళాశాల]]లో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం [[పర్లాకిమిడి]]లో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, [[సవర]] భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. [[రైతుబిడ్డ]], [[స్వర్గసీమ]] వంటి కొన్ని చలనచిత్రాలలోను మరియు కొన్ని నాటకాలలోను నటించారు.
 
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు.
 
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను [[ఒరిస్సా]] రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు [[లండన్]] వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించరు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒరిస్సా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.