తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:సంస్కృతం నుండి తెలుగు లోకి అనువాదాలు చేసినవారు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 41:
==చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి==
{{main|చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి}}
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి [[ప్రమోదూత]] సంవత్సర [[శ్రావణ శుద్ధ ద్వాదశి]] సోమవారం అనగా [[1870]] [[ఆగస్టు 8]]న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కడియం]] గ్రామంలో జన్మించాడు. ఆయన ముత్తాత తమ్ముడు [[వేంకటేశ్వర విలాసము]], [[యామినీ పూర్ణతిలక విలాసము]] అనే మహాద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉండేవి. తరువాత వారు [[యానాం]]కు సమీపం లో ఇంజరం కు మకాం మార్చారు. [[యానాం]]లో వేంకట శాస్త్రి తెలుగు, [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
శ్రీవెంకటకవి చదువుకై ఎందరెందరో గురువులను ఆశ్రయించి తిరిగి తిరిగి శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రిని ఆశ్రయించారు. అప్పటికే వారివద్ద కౌముది చదువుతున్న శ్రీ తిరుపతిశాస్త్రితో పరిచయమైనది. కాని కాలు నిలువని వెంకటకవి విద్యాగ్రహణమునకై [[వారణాసి]]కి పోవలెనను ఉబలాటము కలిగి, గురువులతో మాయమాటలు చెప్పి ఒక మిత్రునితో కాశికి బయలుదేరినాడు. డబ్బులేదు. నిడమర్రు చేరి అక్కడి ఉద్యోగుల సభలో శతఘంటకవనము చేయగలనని ప్రగల్భముగా పద్యాలు చెప్పెను. అప్పటికి ఆయన వయసు 20సం. కూత ఘనముగా ఉన్నదని ఆయనతో అష్టావధానము చేయించిరి. పూర్తి చేసి, అయ్యా నేనెప్పుడు అష్టావధానము చేయలేదని ఊరక అడిగిన ధనమీయరని ప్రగల్భములు పలికితిని, లోపములున్న మన్నింపమని పలికిరి. వేంటనే సభ్యులందరు కోపమేమీ లేదని బాగుగా చేసితివి అని పలికి రూ.30 ఇచ్చి సత్కరించిరి వెంకటకవిని. అదే ఆయన మొదటి అవధానము. రెండవ అవధానము గుండుగొల్లులో చేసిరి. శ్రీ శాస్త్రిగారు కాశిలో ఎక్కువకాలముండలేదు. గురువుల ఆదేశమును అనుసరించి స్వదేశము తిరిగివచ్చిరి. కాశీ సమారాధనముకు, గంగపూజకు డబ్బుకొరకు కోనసీమలో ముమ్మిడివరము, ఐనాపురము, కేసవకుర్తిలో అవధానము చేసి ధనం సంపాదించి గంగపూజ చేసారు.
|