గడ్డం రాంరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జి.రాంరెడ్డి''' ([[1929]] - [[1995]]) దూరవిద్య ప్రముఖులు మరియు సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు" (Father of Open Universities) గా పరిగణిస్తారు.
 
వీరు [[1929]] [[డిసెంబరు 4]]న [[కరీంనగర్]] జిల్లా [[మైలారం]] గ్రామంలో జన్మించారు.
పంక్తి 6:
 
1980 దశాబ్దంలో వీరు [[దూరవిద్య]] వైపు దృష్టి మళ్ళించి దానిపై విశేషాధ్యయనం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన [[బ్రిటిష్ ఓపెన్ యూనివర్సిటీ]] గురించి నిశితంగా పరిశీలించారు. [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం కోరిక మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ప్రారంభించే విషయంలో ఒక నివేదిక సమర్పించారు. దీనిని ప్రభుత్వం ఆమోదించి 1982 లో దేశంలో మొట్టమొదటగా ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీనిని డాక్టర్ [[బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము]] గా నామకరణం చేశారు. దీనికి మొదటి వైస్ ఛాన్సలర్ గా వీరిని నియమించారు. వీరు ఈ విశ్వవిద్యాలయాన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దారు. వీరి కృషిని గుర్తించి [[భారత ప్రభుత్వం]] 1985లో ప్రారంభించిన [[ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం]] వైస్ ఛాన్సలర్ గా నియమించింది. అక్కడ వారు చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
 
దూరవిద్యా పితామహులైన రాంరెడ్డి గారు లండన్ లో [[జూలై 2]], [[1995]]లో పరమపదించారు.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/గడ్డం_రాంరెడ్డి" నుండి వెలికితీశారు