తుమకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
ఇక్కడ పండించే ప్రధాన పంటలు చిరుధాన్యాలు, వరి, పప్పుదినుసులు, పోకచెక్కలు మరియు నూనెగింజలు. పరిశ్రమలలో ముతక నూలు వస్త్రాలు, ఉన్ని కంబళ్ళు, తాళ్ళు, గడియారాలు (హిందుస్తాన్ మెషీన్ టూల్స్), విప్రో, టి.వి.ఎస్.ఈ మరియు కార్‌మోబిల్స్ ముఖ్యమైనవి. తుముకూరు పరిసరాల్లోని క్యాట్‌సండ్రలో సిద్ధగంగ మఠము ప్రసిద్ధమైనది. ఇక్కడ దేశములోని వివిధ ప్రాంతాలకు చెందిన 8000కు పైగా విద్యార్ధులు వివిధ సిద్ధగంగ సంస్థలలో విద్యనభ్యసించుచున్నారు. ఈ మఠానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగు కళాశాల (సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కూడా ఉన్నది. ఇటీవల సిద్ధగంగ మఠం నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రస్తుత మఠ నిర్వాహకుడు శివకుమార్ స్వామీజీని కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ''కర్ణాటక రత్న'' పురస్కారంతో సత్కరించింది.
 
కర్ణాటక అర్ధశతోత్సవం "సువర్ణ కర్ణాటక" పురస్కరించుకొని తుమ్కూరు యొక్క అధికారిక నామాన్ని తుమకూరుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఇంకా ఆమోదించలేదు. 80% శాతం రాష్ట్ర జనాభా రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు చేరటానికి తుమకూరు గుండా ప్రయాణించటం విశేషం. T
 
[[వర్గం:కర్ణాటక]]
"https://te.wikipedia.org/wiki/తుమకూరు" నుండి వెలికితీశారు