మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
సవరణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''[[మాదయ్యగారి మల్లన]]''' [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజముల]]లో ఒకడు. 16వ శతాబ్దపు [[తెలుగు]] కవి. ఇతడు శైవబ్రాహ్మణుడు. అప్పటికే మల్లన్న అని మరో కవి ఉండటంచేత ఈయన్ను తండ్రి పేరితోడగూడ జేర్చి మాదయ్యగారి మల్లన్న యని చెప్పుదురు.<ref name=kandukuri />
 
మల్లన 516 గద్యపద్యములతో కూడిన [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]] అను మూడు అశ్వాసాల కావ్యమును రచించాడు. ప్రబంధ శైలిలో రచించబడిన [[రాజశేఖర చరిత్]]రలోచరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ [[గ్రంథము]]నుగ్రంథమును ఈయన [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని [[కవిత్వము]] మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉంది.<ref name=kandukuri>{{cite book|last1=కందుకూరి|first1=వీరేశలింగం పంతులు|title=ఆంధ్రకవుల చరిత్రము - రెండవ భాగము (మధ్యకాలపు కవులు)|date=1949|publisher=హితకారిణీ సమాజము|location=రాజమండ్రి|page=64|url=https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8|accessdate=7 December 2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.
 
రాయలతోపాటు [[దండయాత్ర]]లకు, [[తీర్థయాత్ర]]లకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన [[కావ్యము]]ను [[1516]] - [[1520]] మధ్య [[వినుకొండ]], [[గుత్తి]] సీమలను పరిపాలించిన [[నాదెండ్ల అప్పమంత్రి]]కి అంకితమిచ్చాడు. అప్పమంత్రి [[తిమ్మరుసు]] మేనల్లుడు, అల్లుడు.
 
ఆంధ్ర [[మహిళలు]] ఐదవతనముగా భావించే [[నల్లపూసలు|నల్లపూస]]ల గురించిన ప్రస్తావన [[సాహిత్యము]]లో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి [[గృహప్రవేశము]] వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్ళితంతు గురించి [[రాజశేఖరచరిత్ర]]లో వర్ణించాడు.
 
==రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)==
మల్లన తన గురించి [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]]లో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన [[కృష్ణా జిల్లా]]లోని [[అయ్యంకిపురము]]కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]]లో పెరిగినాడు. ఈయన [[గురువు]] [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] [[పుష్పగిరి]]కి చెందిన అఘోర శివాచార్యులు.
"https://te.wikipedia.org/wiki/మాదయ్యగారి_మల్లన" నుండి వెలికితీశారు