పెంపుడు కూతురు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దేవిక నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 27:
* షావుకారు జానకి
* వల్లూరి బాలకృష్ణ
* [[బొడ్డపాటి కృష్ణారావు|బొడ్డపాటి]]
 
==చిత్రకథ==
తిరుపతి (రమణారెడ్డి) సీతమ్మ దంపతుల కుమారుడు రఘు (యన్.టి.ఆర్) వారి పెంపుడు కూతురు ఉమ(దేవిక), గాయనిగా, స్కూల్ టీచర్‌గా మంచి పేరుసంపాదించుకుంటుంది. దశావతారం (రేలంగి) కుమారుడు వాసు (హరనాథ్) కుమార్తె మంజుల (షావుకారు జానకి) భార్య రమాదేవి. వాసు, ఉమ ప్రేమించుకుంటారు. రఘు, తండ్రితో కలిసి పేకాట ఆడడం, బలాదూర్‌గా తిరగడం, కుస్తీపోటీల్లో పాల్గొనటం చేస్తుంటాడు. దశావతారం ధనవంతుడైనా ఉమ గుణం నచ్చి ఆమెతో తన కొడుకు పెళ్ళికి అంగీకరిస్తాడు. రఘు పాల్గొన్న కుస్తీపోటీలకు జడ్జిగా వచ్చిన మంజులను రఘు అవమానిస్తాడు. రఘు సోదరి ఉమ అని తెలుసుకున్న మంజుల, ఆమె తల్లి ఉమతో వాసు పెళ్ళికి అంగీకరించరు. ఇంటినుంచి వెళ్ళిపోవాలనుకున్న ఉమకు తల్లి ఆమె తమ పెంపుడు కూతురని నిజం తెలియచేసి, అన్నను తండ్రిని దారిలోపెట్టమని బాధ్యత అప్పగించి మరణిస్తుంది. మంజుల నాట్యప్రదర్శన చేస్తూ ప్రమాదంలో చూపుకోల్పోతుంది. తండ్రి, అన్నలవల్ల ఉద్యోగం పోగొట్టుకున్న ఉమ, జైలుకి వెళ్ళిన అన్నకోసం, ఓ ముసలివానితో పెళ్ళికి సిద్ధపడుతుంది. రఘులో మార్పు వచ్చి జైలునుంచి రాగానే ఆ పెళ్ళి ఆపాలనుకుంటాడు. కాని ఉమకు, వాసుతో పెళ్ళి జరిగిందని తెలుసుకుని, చూపులేని మంజులను, తాను మూగవాడినని చెప్పి పెళ్ళి చేసుకుంటాడు. మంజులకు నిజం తెలిసి భర్తకు దూరంగా బెంగుళూరు వెళ్ళిపోతుంది. వాసు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళతాడు. ఉమ అత్తగారు ఆమెను ఇంటినుంచి వెడలగొడుతుంది. ఒక బిడ్డను కని ఆ ఊరికి దూరంగా బ్రతుకుతుంటుంది ఉమ. రఘు భార్య మంజుల దగ్గరకు బెంగుళూరు మారువేషంలో వెళ్ళి ఆమె మనసుమారుస్తాడు. తిరిగి తమ వూరు వచ్చేటప్పుడు రైల్వేట్రాక్ మీద ప్రమాదంలో వున్న ఉమ బిడ్డ (మేనల్లుడి)ని కాపాడి, అందరిచేత మెప్పుపొందుతాడు. వాసు విదేశాలనుంచి తిరిగి రావటంతో కథ సుఖాంతం అవుతుంది<ref>{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 పెంపుడు కూతురు |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=14 June 2013}}</ref>.
"https://te.wikipedia.org/wiki/పెంపుడు_కూతురు" నుండి వెలికితీశారు