[[తెలంగాణ]] సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ '''కొత్తపల్లి జయశంకర్''' ([[ఆగష్టు 6]], [[1934]] - [[జూన్ 21]], [[2011]]) [[వరంగల్హనుమకొండ జిల్లా]], [[ఆత్మకూరు (వరంగల్ జిల్లా)|ఆత్మకూరు]] మండలం [[పెద్దాపూర్]] గ్రామశివారు [[అక్కంపేట (పెద్దాపూర్ (ఆత్మకూరు)|అక్కంపేట]]లో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ [[బ్రహ్మచారి]]గా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్డి పట్టా పొంది, ప్రిన్సిపాల్గా, రిజిష్ట్రార్గా పనిచేసి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ ఏర్పాటులో [[కె.చంద్రశేఖరరావు]]కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు.