ఆధునిక పద్ధతుల్లో [[ఆంధ్రఆంధ్రప్రదేశ్ ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం [[విశాఖపట్నం]]లోవిశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్రప్రజలకు లేకపోయినా స్వంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి, ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా (బళ్ళారితో కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు [[ఉద్యమాలు]], సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది. <ref>ఆంధ్రప్రదేశ్-గ్రంథాలయోద్యమము:పి.నాగభూషణం:1957</ref>
===ప్రస్తుత స్థితి ===
[[file:City central library.JPG|thumb|హైద్రాబాద్ లో సెంట్రల్ లైబ్రరి]]