గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[ఫైలు:Gudavalli Ramabrhmam.jpg|right|200px]]
'''గూడవల్లి రామబ్రహ్మం''' ([[1902]], [[జూన్ 24]] - [[1946]], [[అక్టోబర్ 1]]) ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు సంపాదకుడు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకు మించిన సామాజిక ప్రయోజనముందని [[మాలపిల్ల]], [[రైతుబిడ్డ]] చిత్రాల ద్వారా చాటిన దార్శనికుడు.[[హేతువాది]] .
 
Line 11 ⟶ 12:
 
[[సముద్రాల రాఘవాచార్య]], [[కుర్రా సుబ్బారావు]]లు ఇతనికి సహాయపడుతుండేవారు. [[నార్ల వెంకటేశ్వరరావు]] గారు ఆంధ్రప్రభలో చేరక మునుపు 1937లో ఇతనికి సహాయ సంపాదకునిగా పనిచేశారు. ఆ తరువాత [[ఆండ్ర శేషగిరిరావు]], [[ముద్దా విశ్వనాథం]], [[బోయి భీమన్న]]లు కూడా పత్రికా సహాయ సంపాదకులుగా పనిచేశారు.
 
 
[[తాపీ ధర్మారావు]], [[వేలూరి శివరామశాస్త్రి]], [[త్రిపురనేని గోపీచంద్]] మొదలైన వారు సాహిత్య వ్యాసాలు రాసేవారు. సంఘాన్ని నిష్కర్షగా విమర్శించి సంచలనం కలిగించే రచనలతో పత్రిక సాగించాలి. అపూర్వ విషయాలతో పత్రిక విజ్ఞాన సర్వస్వం అనిపించుకోవాలి అనే లక్ష్యాలతో రామబ్రహ్మం సమర్ధులైన రచయితల సహకారంతో పత్రికను నిర్వహించేవారు.
Line 20 ⟶ 22:
[[బొమ్మ:Telugucinemaposter malapilla 1938.JPG|right|150px]]
దక్షిణాది రాష్ట్రాల్లో బ్రాహ్మణేతరుల [[ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం]]తో బాటు [[గాంధీజీ]] [[హరిజనోద్ధరణ ఉద్యమం]] కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం లో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా [[మాలపిల్ల]] చిత్రాన్ని ఉన్నత ప్రమాణాలతో నిర్మించాడు. అసలు సిసలు సామాజిక ప్రయోజనం గల చిత్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన చిత్రం మాలపిల్ల.[[జస్టిస్ పార్టీ]] వారి సమదర్శిని తో బాటు ప్రజామిత్ర పత్రికకూ సంపాదకుడైన రామబ్రహ్మం పత్రికల కన్నా సినిమాయే శక్తివంతమైన ప్రచార సాధనమని గుర్తించి ఊపిరిపోసిన చిత్రమిది. ఆనాడు దేశాన్ని పట్టి ఊపేస్తున్న హరిజనోద్యమాన్ని రామబ్రహ్మం తన సినిమాకు ఇతివృత్తంగా తీసుకుని,[[గుడిపాటి వెంకటచలం]] తో కథారచన చేయించాడు. ఈ సినిమాకు [[తాపీ ధర్మారావు]] సంభాషణలు వ్రాశాడు.చలం, ధర్మారావు ఇద్దరూ ఆనాటి సమాజంలో చలామణి అవుతున్న అర్థం లేని ఆచారాలను అపహాస్యం చేసిన వారే.మాలపిల్ల చిత్రం లోని పాటలకు భావకవి [[బసవరాజు అప్పారావు]] కావ్యగౌరవం కల్పించాడు.ఇందరు ప్రముఖుల సౄజనాత్మక భాగస్వామ్యంతో తయారైన మాలపిల్ల తెలుగు నాట అఖండ విజయం సాధించింది.జస్టిస్ పార్టీ నేతృత్వంలో [[1920]]వ దశాబ్దంలో బ్రాహ్మణేతరుల ఆత్మగౌరవ సంరక్షణ ఉద్యమం జోరుగా నడిచిన ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
 
 
మాలపిల్ల చిత్రం [[కాంచనమాల]]ను సూపర్ స్టార్ ను చేసింది. పౌరాణిక చిత్రాల జోరులో ప్రప్రథమంగా ఒక సమకాలీన సమస్యను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రం అప్పటి ఉమ్మడి [[మద్రాసు రాష్ట్రం]]లోని తెలుగు భాషాప్రాంతాల్లోనే గాక ఇతర భాషా ప్రాంతాల్లో కూడా పెద్ద హిట్. నాటి గాయని, నటి సుందరమ్మతో కలిసి ఆమె పాడిన నల్లవాడే గొల్లపిల్లవాడే సూపర్ హిట్ అయింది.అప్పటికింకా భాషాదురభిమానం తలెత్తక పోవడంతో దక్షిణభారతమంతటా ఆ పాట జనం నాలుకలపై నర్తించింది.
 
 
ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో బెజవాడలో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' బ్రాహ్మణులు మాలపిల్లను చూడరాదని తీర్మానించింది.అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం [[రైతుబిడ్డ]]
Line 28 ⟶ 32:
[[బొమ్మ:Telugucinemaposter raitubidda 1939.JPG|right|150px]]
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]] తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు రైతులు తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.
 
 
ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా [[త్రిపురనేని గోపీచంద్]] మాటలు వ్రాశాడు. కొసరాజు పాటలు వ్రాయగా, [[జమీన్ రైతు]] ఉద్యమంలో [[నెల్లూరు వెంకట్రామానాయుడు]] వ్రాసిన గీతాలను కూడా ఈ సినిమాలో వాడుకున్నారు. సంగీత దర్శకుడు [[బి.నరసింహారావు]].
 
 
ఈ సినిమాకు వ్యతిరేకత సనాతన వర్గాలకంటే బలంగా జమీందార్ల నుంచి ఎదురైంది. మాలపిల్లను ప్రభుత్వం నిషేధించలేదు. కానీ జమీందార్లు రైతుబిడ్డ సిన్మాను ప్రభుత్వం చేత నిషేధింపజేయగలిగారు. ఇంకో విచిత్రమేమిటంటే జమీందార్ల ఘాతుకాలను నిరసించిన ఈ సినిమాను నిర్మించినది ఒక జమీందారు. ఈ చిత్ర నిర్మాత అయిన [[చల్లపల్లి రాజా]] జమీందార్ల పార్టీ అయిన జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. పార్టీ లో ఆయన ప్రత్యర్థి వర్గానికి నాయకుడైన [[మీర్జాపురం రాజా]] ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, తిరోగమన ధోరణిలో అనేక జానపద, పౌరాణిక చిత్రాలను నిర్మించాడు.
 
 
రైతుబిడ్డ చిత్రాన్ని జమీందార్ల ఒత్తిడిపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినా ఆ చిత్రం ప్రతిబింబించిన స్ఫూర్తి కాలక్రమంలో విజయం సాధించింది. 1955లో విడుదలై ఘనవిజయం సాధించిన [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] చిత్రాన్ని రైతుబిడ్డకు కొనసాగింపు అనుకోవచ్చు. ఇటువంటి చిత్రాల ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైన కోస్తా రైతాంగ చైతన్యం కాలక్రమంలో [[తెలుగుదేశం పార్టీ]] ఘన విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. కులవ్యవస్థ నిర్మూలన సందేశం ఇవ్వడం కోసం కూడా రామబ్రహ్మం నడుం కట్టాడు. [[పల్నాటి బ్రహ్మనాయుడు]] పాత్ర ద్వారా ఈ సందేశాన్ని ఇవ్వడానికి [[పల్నాటి యుద్ధం]] సినిమా తీశాడు.