రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధి, అంబేద్కర్ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. [[వరవరరావు]] గారు చేతకాని వాళ్ళని కొజ్జా వాళ్ళతో పోలుస్తూ ఒక కవిత వ్రాసినప్పుడు స్త్రీలని, కొజ్జావాళ్ళని కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో వివరిస్తూ రంగనాయకమ్మ గారు వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం చదివి [[వరవరరావు]] గారు వెంటనే తప్పుని అంగీకరించారు. [[అసమానత్వం నుంచి అసమానత్వం లోకే]] ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి.
 
===వివాదాలు===
ఈమె వ్రాసిన నవల '[[జానకి విముక్తి]]' [[ఆంధ్రప్రభ]] వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. [[నీడతో యుద్ధం]] పుస్తకంలో [[గోరా]], [[జయగోపాల్]], [[సి.వి.]], ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యం లో తీవ్ర సంచలనం కలిగించిన [[యండమూరి వీరేంద్రనాథ్]] నవల '[[తులసీదళం]]' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ [[కొమ్మూరి వేణుగోపాలరావు]] ను కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.
 
 
=="జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ==
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు