వైవస్వత మనువు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ జరుగుతున్నది
పంక్తి 1:
[[హిందూమతము|హిందువుల]] [[పురాణములు|పురాణాల]] ప్రకారం ఒక '''[[మనువు]]''' యొక్క పాలనా కాలాన్ని '''[[మన్వంతరము]]''' అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఒక [[బ్రహ్మ]] దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము" నడుస్తున్నదని, ఈ మన్వతంతరానికి అధిపతి '''వైవస్వత మనువు''' అని పురాణాల కధనం. [[భాగవతం]] [[అష్టమ స్కంధం]]లో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. [[నవమ స్కంధం]]లో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.
 
 
పంక్తి 5:
 
 
చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు. తరువాత వైవస్వత మన్వంతరం మొదలయ్యింది. వైవస్వత మనువు వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది. ఈ మనువుకు తొమ్మండుగురు పుత్రులు - [[ఇక్ష్వాకుడు]], [[శిబి]], నాభాగుడు, దృష్టుడు, [[శర్యాతి]], నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. <!-- (ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు) సరి చూడాలి. -->
 
ఈ మన్వంతరంలో భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు [[వామనుడు]]గా జన్మించి బలి చక్రవర్తినుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు. సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఇంద్రుడు - పురందరుడు. సురలు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
 
 
వివస్వంతుని భార్య సంజ్ఞ. వారి పుత్రుడు శ్రాద్ధ దేవుడు లేదా సత్యవ్రతుడు. అతడే వైవస్వత మనువు అయ్యాడు. అతని భార్య శ్రద్ధ. వారికి తొమ్మండుగురు పుత్రులు - [[ఇక్ష్వాకుడు]], [[శిబి]], నాభాగుడు, దృష్టుడు, [[శర్యాతి]], నరిష్యంతుడు, నభగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు. <!-- (ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు) సరి చూడాలి. --> అయితే ఆ పుత్రులు జన్మించడానికి ముందే వైవస్వతుడు పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. ఆయజ్ఞంలో హోత మంత్రాలలో చేసిన పొరపాటు వన వారికి "ఇల" అనే కుమార్తె కలిగింది. వశిష్ఠుని వరం వలన ఆ కుమారి "సుద్యుమ్నుడు" అనే పురుషునిగా మారి, ప్రభువయ్యాడు. కాని పార్వతీదేవి శాపగ్రస్తమైన ఒక వనంలో ప్రవేశించినపుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారి, బుధునితో సంగమించి "పురూరవుడు" అనే కుమారుని కన్నది. తండ్రి (తల్లి) అనంతరం పురూరవుడు రాజయ్యాడు.
 
 
వైవస్వత మనువు మరొక పుత్రుడైన పృషధ్రుడు తమ కులగురువైన వశిష్ఠుని వద్ద ఆలమందల కాపరిగా ఉన్నాడు. ఒకమారు చీకటిలో చేసిన పొరపాటువలన గోవు మరణించగా శాపగ్రస్తుడయ్యాడు. అయినా గాని భగవధ్యానం వదలకుండా సాగించి మోక్షం పొందాడు. కలి అనే మనుపుత్రుడు కూడా రాజ్యవిరక్తుడై వైరాగ్యంతో ధ్యానం చేసి భగవత్సాన్నిధ్యం పొందగలిగాడు. మనువు మరొక పుత్రుడు కారూశుని వంశంవారు "కారూశులు" అనే క్షత్రియులుగా ఉత్తర భారతదేశపు ఏలికలయ్యారు. దృష్టుని సంతానం "భార్యట వంశం"గా బ్రాహ్మణ వ్రతం పాలించి బ్రాహ్మణులయ్యారు. వీరిలో అగ్నివేశుడు అనే అతని పేరుమీద అగ్నివేశ్యాయనం అనే బ్రాహ్మణవంశం కలిగింది.
 
 
దిష్టుని పుత్రుడు నాభాగుడు కృషి, గోరక్షణాది వ్యాపారాలను ఛేబట్టి వైశ్యుడయ్యాడు. అతని వంశంలోని వాడే అయిన మరుత్తుడు క్షత్రియ కర్మలు చేబట్టి క్షత్రియుడయ్యాడు. మరుత్తుని వంశంలో తృణబిందువు, ఐలబిలుడు వంటి ప్రసిద్ధులున్నారు. ఐలబిలుడు "కుబేరుడు" అనే పేరుమీద ఉత్తరదిక్కుకు పాలకుడయ్యాడు. మనువు మరొక పుత్రిక శర్యాతికి [[సుకన్య]] అనే కుమార్తె జనించింది. ఆమె చ్యవనమహర్షిని పెండ్లాడింది. మరొక మనుపుత్రుడు నభగుని కొడుకు నాభాగుడు ఉత్తమధర్మమూర్తి, పండితుడు. అతనికి పుత్రుడు [[అంబరీషుడు]] ఉత్తమ విష్ణుభక్తుడు.
 
 
వైవస్వత మనువుకు ఒకసారి తుమ్ము వచ్చినపుడు ముక్కు రంధ్రంనుండి వెలువడిన బిడ్డ ఇక్ష్వాకుడు [[ఇక్ష్వాకు వంశము]]నకు మూలపురుషుడయ్యాడు. ఇక్ష్వాకు కులతిలకుడే ధర్మమూర్తియైన [[శ్రీరామచంద్రుడు]].
 
 
 
 
 
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/వైవస్వత_మనువు" నుండి వెలికితీశారు