ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
| weight =
}}
'''ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం''' (1946 జూన్ 4 - 2020 సెప్టెంబరు 25) నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు. అతడిఆయన పూర్తి పేరు '''శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.''' అతన్నిఆయన్ను ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా '''బాలు''' అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీ గాయకుడిగా అతనిఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాతఅనతి కాలంలోనే మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు.
 
1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో నటించాడు. తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించాడు. [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది కళాకారులకు గాత్రదానం చేశాడు. [[కమల్ హాసన్]], [[రజినీకాంత్|రజనీకాంత్]], [[సల్మాన్ ఖాన్]], [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]], [[జెమినీ గణేశన్|జెమిని గణేశన్]], [[గిరీష్ కర్నాడ్]], [[అర్జున్ సర్జా|అర్జున్]], [[నగేష్]], [[రఘువరన్]] లాంటి వాళ్ళకి గాత్రదానం చేసాడు.
పంక్తి 34:
సినిమాల్లోనే కాక టి.వి రంగంలో ఆయన [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]], పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించాడు.
 
అతను కేంద్ర ప్రభుత్వం నుండి 2001 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2011 లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కారాన్ని అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. 2021లోమరణానంతరం2021లో మరణానంతరం కేంద్ర ప్రభుత్వం బాలుకు [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మ విభూషణ్]] పురస్కారాన్ని ప్రకటించింది.
 
== జీవిత చరిత్ర ==
 
===బాల్యం, విద్యాభ్యాసం===
బాలసుబ్రహ్మణ్యం 1946, జూన్ 4 న నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో సాంప్రదాయ వీరశైవ ఆరాధ్య బ్రాహ్మణ కుటుంబానికి చెందిన [[శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి]], శకుంతలమ్మ దంపతులకు జన్మించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/sp-balasubrahmanyam-actor-to-singer-life-journey/0201/120112193|title=బహుముఖ ప్రజ్ఞాశాలి..ఎస్పీబీ|website=www.eenadu.net|language=te|access-date=2020-09-25}}</ref> అతని స్వగ్రామం మొదట గోల్కొండ పాలకుల ఆధీనంలో ఉండేది. ఆ తరువాత 1825 నుండి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమయ్యింది.<ref>{{Cite web|url=https://tiruvallur.nic.in/about-district/|title=About District {{!}} Tiruvallur District {{!}} India|language=en-US|access-date=2020-09-25}}</ref> అతని తండ్రి పేరొందిన హరికథా కళాకారుడు. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. తండ్రి భక్తిరస నాటకాలు కూడా వేస్తుండేవాడు. సాంబమూర్తితో ఇంట్లో పండితులు, కవులు భాషా, సాహిత్య పరమైన చర్చలు జరుపుతూంటే విని, బాలసుబ్రహ్మణ్యానికి బాల్యం నుంచే భాషపై ఆసక్తి పెరిగింది. <ref>ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం - మార్గదర్శి, ఈటీవీ (మార్గదర్శి) 2013 టీవీ కార్యక్రమం, స్థానం:3:55 ని - 4:38 ని, publisher=ఈటీవీ2</ref> తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది.
 
ఐదేళ్ళ వయసులో తండ్రితో కలిసి భక్త రామదాసు అనే నాటకంలో నటించాడు. ప్రాథమిక విద్య [[నగరి]] లోని మేనమామ శ్రీనివాసరావు ఇంటిలో ఉంటూ పూర్తి చేశాడు. శ్రీకాళహస్తిలోని బోర్డు పాఠశాలలో స్కూలు ఫైనలు చదివాడు. చదువులోనే కాక, ఆటల్లో కూడా మొదటి వాడుగా ఉండేవాడు. [[శ్రీకాళహస్తి]]<nowiki/>లో చదివేటప్పుడే జి. వి. సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు [[చెంచులక్ష్మి (1958 సినిమా)|చెంచులక్ష్మి]] సినిమాలో [[పి.సుశీల|సుశీల]] పాడిన ''పాలకడలిపై శేషతల్పమున'' అనే పాటను ఆలపింపజేసి టేపు మీద రికార్డు చేయించాడు. రాధాపతి అనే మరో ఉపాధ్యాయుడు ఈయనను ''ఈ ఇల్లు అమ్మబడును'', ''ఆత్మహత్య'' లాంటి నాటకాల్లో నటింప జేశాడు. తర్వాత తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటికలో స్త్రీ పాత్ర ధరించాడు. [[ఆకాశవాణి కేంద్రం, విజయవాడ|ఆకాశవాణి విజయవాడ కేంద్రం]]<nowiki/>లో బాలు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన లలిత గీతానికి బహుమతి లభించింది.
 
[[తిరుపతి]]<nowiki/>లో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్ళిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుకునే రోజుల్లోనూ, ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లోనూ కొన్నేళ్ళు మంచి ఇంజనీర్ కావాలని, ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరుగా పనిచేయాలని కలలు కనేవాడు. ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. <ref>{{cite interview|last=ఎస్పీ|first=బాలసుబ్రహ్మణ్యం|interviewer=యమునా కిషోర్|title=ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ {{!}}{{!}}- కాఫీ విత్ యమునా కిషోర్|url=https://www.youtube.com/watch?v=LWRleubHaVM|accessdate=}}</ref>
 
=== గాయకునిగా ప్రయత్నం ===
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు [[సుసర్ల దక్షిణామూర్తి]], [[పెండ్యాల నాగేశ్వరరావు]], [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] లు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో [[ఎస్.పి.కోదండపాణి|ఎస్. పి. కోదండపాణి]] బాలు ప్రతిభను గమనించాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చాడు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. [[1966]]లో నటుడు, నిర్మాత అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు. "''ఏమి ఈ వింత మోహం''" అనే పల్లవి గల ఈ పాటను ఆయన [[పి.సుశీల|పి. సుశీల]], [[కల్యాణం రఘురామయ్య]], [[ప్రతివాది భయంకర శ్రీనివాస్|పి. బి. శ్రీనివాస్]] లతో కలిసి పాడాడు.<ref name=tamilstar>tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20051117102300/http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml |date=2005-11-17 }} గురించి వివరాలు [[జూన్ 04]], [[2008]]న సేకరించబడినది.</ref> ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్ తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి అవకాశాలు ఇప్పించేవాడు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నారు బాలు.
 
1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశాడు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచాడు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దూజె కేలియె|ఏక్ దుజే కేలియే]] లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20080605193716/http://www.eenadu.net/breakhtml5.asp |date=2008-06-05 }} పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
పంక్తి 55:
 
=== నటునిగా ===
అతను 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు.<ref>{{Cite web|url=http://lifestyle.iloveindia.com/lounge/sp-balasubramaniam-biography-4164.html|title=SP Balasubramaniam Biography - SP Balasubramanyam Profile, Childhood & Filmography|website=lifestyle.iloveindia.com|language=en-US|access-date=2020-08-15}}</ref> 1990 లో తమిళంలో వచ్చిన ''కేలడి కన్మణి'' అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో [[రాధిక శరత్‌కుమార్|రాధిక]] కథానాయిక. ఈ సినిమా తెలుగులో ''ఓ పాపా లాలి'' అనే పేరుతో అనువాదం అయింది. ఇంకా [[ప్రేమ (1989 సినిమా)|ప్రేమ]] (1989), [[ప్రేమికుడు]] (1994), [[పవిత్ర బంధం (1996 సినిమా)|పవిత్రబంధం]] (1996), [[ఆరో ప్రాణం]] (1997), [[రక్షకుడు]] (1997), [[దీర్ఘ సుమంగళీ భవ]] (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించాడు. 2012 లో [[తనికెళ్ళ భరణి]] దర్శకత్వంలో వచ్చిన [[మిథునం (2012 సినిమా)|మిథునం]] సినిమాలో కథానాయకుడిగా, 2015లో [[మూడు ముక్కల్లో చెప్పాలంటే]] సినిమాల్లో కనిపించాడు. ఇందులో [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] నాయికగా నటించింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రాల విభాగంలో మూడవ బహుమతిగా [[2012 నంది పురస్కారాలు|2012 నంది ప్రత్యేక పురస్కారం]] లభించింది.<ref>{{Cite news|url=http://www.hindustantimes.com/regional-movies/nandi-awards-here-s-the-complete-list-of-winners-for-2012-and-2013/story-98h1g3ETtYipb4qGVgcgaM.html|title=Nandi Awards: Here’s the complete list of winners for 2012 and 2013|date=2017-03-01|work=hindustantimes.com/|access-date=29 June 2020|language=en}}</ref> నంది ప్రత్యేక పురస్కారం లభించింది.
 
=== డబ్బింగ్ కళాకారుడిగా ===