మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
ఈయన [[8 జనవరి]] [[1889]] లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్ మరియు నరసమ్మ.
 
బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం [[మద్రాసు]] లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
 
[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] ప్రోత్సాహం మీద [[కాకినాడ]] లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు.
 
ఇతనికి భారత ప్రభుత్వం [[1968]] లో [[పద్మ భూషణ్ పురస్కారం]] ఇచ్చి గౌరవించింది.