మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[మామిడిపూడి వెంకటరంగయ్య]] (1889 - 1982) ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్ధిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.
 
ఈయన [[8 జనవరి]] [[1889]] లో [[నెల్లూరు జిల్లా]] [[కోవూరు]] తాలూకా [[పురిణి]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్ మరియు నరసమ్మ.
 
బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం [[మద్రాసు]] లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.