పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
మరికొంత విస్తరణ
పంక్తి 1:
'''పింగళి దశరధరామ్''', [[హేతువాది]], పత్రికా సంపాదకుడు. దశరధరామ్ తన స్వీయ సంపాదకత్వంలో [[విజయవాడ]] సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపే వాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపీలతో మొదలు పెట్టబడింది. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌంటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట. దాదాపు 5 లక్షల కాపీలవరకు అమ్ముడు పోయేదని చెప్పుకుంటారు.
 
==సంపాదక/రచనా శైలి==
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>http://www.dailyexcelsior.com/02aug01/national.htm</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది.
ఇతను యెల్లొ జర్నలిజంకు తెలుగు నాట తెర తీశాడు. తెలుగులో 'కాగడా' వంటి పత్రికలు ఈ యెల్లొ జర్నలిజంను అంతకు ముందే అనుసరించినా, వారు సినిమా వార్తలకు మాత్రమే పరిమితమైనారు. ఇతను రాజకీయ విషయాలు, రాజకీయ నాయకుల గురించి ఆ పద్ధతిలో వ్రాయటం మొదలు పెట్టి, తెలుగులో రాజకీయ '''యెల్లొ జర్నలిజంకు''' తెర తీశాడు. వ్రాసే భాష చాలా మొరటుగా ఉండి, 'మర్యాద' 'గౌరవప్రద' వ్రాత పద్ధతులకు ఆమడ దూరాన ఉండటం వల్ల, వ్రాశే విషయాలు నిజమయు ఉండటానికి అవకాశమున్నాప్పటికీ, అన్ని వర్గాల ప్రజల మన్నన పొందలేదు. చౌకబారు పేరయితే సంపాయించాడుగాని, మంచిపేరు పెద్దగా రాలేదు. పలుకుబడిగల పెద్దపెద్ద రాజకీయనాయకుల వ్యక్తిగత విషయాలు దాదాపు చీదర పుట్టేట్టు వ్రాశేవాడు.అలా వ్రాసి వ్రాసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడని అంటారు.
 
దశరధరామ్ యువతరం గురించీ ఎన్నో కలలు కన్నాడు. భగత్ సింగ్ ను "బాంబులతో బంతెఉలాడుకొన్న జాతి హీరో" అని ప్రశసించి అతని స్ఫూర్తితో యువతరం ధైర్యంగా, నిజాయితీగా ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని ఆశించేవాడు. సినిమా అభిమాన సంఘాల్లో, ఇతరేతర వ్యాపకాల్లో మునిగి ఉన్న వాళ్ళను తీవ్రంగా విమర్శించేవాడు ("ఉరేయ్ ! ఇకనైనా కళ్ళు తెరవండ్రా!"). కమ్యూనిజం పట్ల వ్యతిరేకత, ఆర్.ఎస్.ఎస్ పట్ల మరింత వ్యతిరేకత ఉండేవి. "దేశ విద్రోహక ఆరెస్సెస్" అని ఒక పుస్తకం కూడా రాసాడు. అలాగే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం వ్రాశాడు. రాజకీయ నాయకుల్లో ఒక జయప్రకాష్ నారాయణను తప్ప మరెవరినీ గౌరవించలేదు.
 
 
==యెల్లొ జర్నలిజం అంటే==
ఇంగ్లీషు వికీపీడియా ప్రకారం యెల్లొ జర్నలిజం అంటే:
 
*భయం పుట్టించేటటువంటి పెద్ద పెద్ద పతాక శీర్షికలు (హెడ్‌లైనులు), ఎక్కువసార్లు అల్పమైన విషయాల గురించి
*బొమ్మలు లేదా ఊహా చిత్రాల అతి వాడకం
*కల్పిత ఇంటర్వ్యూలు, తప్పుదారి పట్టించే పతాక శీర్షికలు, సైన్సు లాగ కనిపించే విధంగా వ్రాయటం, నిపుణులుగా పిలవ బడే వారిచే పనికిరాని తప్పుడు విజ్ఞానం
*ఆదివారపు అనుబంధాలను (సాధారణంగ వ్యంగ్య చిత్రమాలికలతో )పూర్తి రంగులలో వేయాలన్న పట్టుదల (ప్రస్తుతం ఈ పని అన్ని పత్రికలు చేస్తున్నాయి)
*సంఘ పద్ధతులకు వ్యతిరేకంగా సామాన్య వ్యక్తి మీద అవసరానికి మించి అసాధారణ (అన్‌రీజనబుల్) సానుభూతి.
పైన ఉదహరించిన విషయాలలో దాదాపు అన్నిటిలోనూ ఎన్‌కౌంటర్ ముందుండేది.ప్రస్తుతం, ముఖ్యంగా తెలుగులో కొన్ని వార్తా ఛానెల్స్‌ ఈ విధమైన ఒరవడిలో వెళ్ళటానికి ప్రయత్నం చేయటానికి కారణం,అప్పట్లో 'ఎన్‌కౌంటర్‌'కు వచ్చిన పేరు అయి ఉండవచ్చు.
 
==వ్యక్తిగత జీవితం==
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>http://www.dailyexcelsior.com/02aug01/national.htm</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు