'''గజ్జెల మల్లారెడ్డి''' [[కడప]] జిల్లా [[ఆంకాళమ్మగూడూరుఆంకాళమ్మ గూడూరు]] లో 1925లో[[1925]]లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక [[హేతువాది]]. 1943లో [[కమ్యూనిస్టు పార్టీలోపార్టీ]]లో చేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత'మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో '[[సవ్యసాచి]]' పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు 'విశాలాంధ్ర'కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 'ఈనాడు'లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. '[[ఆంధ్రభూమి]]', '[[ఉదయం]]' వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] డాక్టరేట్. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.