ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:ദ്വൈതം
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
 
 
1. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ తత్వ మిష్యసి
: స్వతంత్రము, అస్వతంత్రము అని తత్వము రెండు విధములు
 
2. ద్వా విధౌ పురుషో లోకే! క్షరశ్చాక్షర ఏవచ! క్షర సర్వాని భూతాని ! కూటస్తోక్షర ఉచ్యతె!!
: లోకములొ పురుషులు రెండు రకాలు. నాశనము చెందేవారు. నాశనము లేనివారు.
ఈ చరాచర జగత్తు అంతా నాశనము చెందేది. మూల కారణుడు అయిన విష్ణువొక్కడే నాశము లేని వాడు.
 
శ్రీమన్మధ్వాచార్యుల చే స్తాపించ బడిన మతము కాబట్టి దీన్ని మధ్వ మతము అని కూడ వ్యవహరిస్తారు.
 
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవ - దేవ బేధము
2. జీవ - జీవ బేధము
3. జీవ - జడ బేధము
4. జడ - దేవ బేధము
5. జడ - జడ బేధము
మాధ్వ దర్షనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
అనగా తారతమ్య పధ్ధతి లో విలువకలిగి ఉన్నారు.
ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష,
గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
 
2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
4. నేను జీవుడను, హరి కన్న భిన్నుడను, హరి సేవ వలననే తరించెదను (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి)
5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం
6. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనే 3 ప్రమాణములు (ఈ 3 ప్రమాణముల చేత పై సూత్రములు నిర్ధారింపబడినవి)
7. అఖిల వేదముల చేత తెలియ చేయ బడినవాడు ఆ హరి ఒక్కడే.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు