హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి కైలాసపర్వతం వ్యాసానికి తరలించాాను. ఆవ్యాసంలో ఉండదగిన సమాచారం
పంక్తి 4:
 
అటువంటి దేవాలయాల్లో అతి ధనవంతులైన దేవుళ్లు / ఆలయాల గురించి మొదటగా తెలిపి, ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలయాల గురించి ఆ పై ఇతర ప్రదేశాలలోని ఆలయాల గురించి విషయం సేకరించి వ్రాయడం జరిగింది. అత్యంత ప్రాముఖ్యత కలిగి, అతి పురాతనమైన ఆలయాల గురించి మాత్రమే వ్రాయడం జరిగింది. ఈ ఆలయాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించ వలసి ఉంది. ఇంకొన్ని ఆలయాలున్నాయి. అవి గతంలో అత్యంత వైభవోపేతంగా వెలుగొంది, పరమతస్థుల దాడిలో కొల్ల గొట్టబడి, వాటి అస్థిత్వం కోల్పోయి, పూజా పునస్కారాలు లేక, కేవలం తమ పూర్వపు ఔన్నత్యాన్ని చూపడానికే సాక్షీభూతంగా అవి నిలబడి ఉన్నాయి. అలాంటి దేవాలయాలను, వాటి యొక్క గత వైభవం దృష్ట్యా, వాటిలో శిల్ప కళా వైభవం దృష్ట్యా ప్రస్తుతం అయా ఆలయాలలో పూజాదికార్యక్రమాలు జరుగక పోయినా పర్యటకులు అధికంగా వస్తున్నందున, వాటిని కూడా ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ వ్యాసం ఒక సమగ్రమైన వ్యాసంగా అవసరమయిన వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావించ బడుతుంది. భారతదేశంలోని ఆలయాలు రాష్ట్రాల వారీగా వివరించబడినవి.
 
== ఇతర దేశాల ఆలయాలు ==
 
=== కైలాసనాథ ఆలయం ===
కైలాశ పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాంగ్డిసె పర్వతాలలో ఒక శిఖరం. ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధు నది, సట్లేజ్ నది (సింధు నది ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది (గంగా నది ఉపనది) మూలానికి దగ్గరగా ఉంటుంది. ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది, అవి:బోన్, బుద్ధిజం, హిందూ మతం, జైనిజం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షస్తల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది.
కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజు లోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52 km పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడి నప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు: యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో . యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు
 
1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది, వీరు చైనిస్, భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు, భూమార్గం గుండా కాట్మండు నుండి లేదా లాసా నుండి విమానాల ద్వారా టిబెట్ చేరుకొని అక్కడినుండి గొప్ప టిబెటన్ పీఠభూమిని కారులో చుడతారు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది, చివరికి దార్చేన్ చేరతారు,>
 
ఇక్కడి చిన్న అవుట్ పోస్ట్ ప్రతి సంవత్సరం ప్రత్యేక సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ఠ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థ యాత్రికుల కోసం ఆధునిక గెస్ట్ హౌసులు అందుబాటులో ఉన్నాయి, అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత టెంట్లలో నిద్రపోతారు. సుదూర-తూర్పు టిబెట్ లోని స్విస్ కోర్సం ఫౌండేషన్ నిదులన్దించే చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రం 1997లో ఇక్కడ స్థాపించబడింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/హిందూ_దేవాలయం" నుండి వెలికితీశారు