దామెర్ల రామారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Varmadatla (చర్చ | రచనలు) చిత్రకళా ప్రతిభ |
+వర్గం, లింకీకరణ, ఇతరాలు |
||
పంక్తి 3:
భారతదేశం గర్వించదగ్గ అతి తక్కువమంది చిత్రకారులలో దామెర్ల రామారావు పేరు మొదటి నలుగురిలో ఉంటుంది. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు.
==బాల్యం- తొలి జీవితం==
==చిత్రకళ ==
ఆ రోజులలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజిలో [[ఆస్వాల్డ్ కూల్డ్రే]] అనే ఆంగ్లేయుడు
కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును
▲కూల్డ్రే దొర సొంతఖర్చుమీద రామారావును బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపాడు. రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు, జె.జె స్కూల్లో ఎందరో జాతీయ, అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్లోని మెళకువలు నేర్చుకున్నాడు. మొదట్లో ఆ కాలేజిలో ఆతన్ని " మద్రాసీ ' అని చిన్న చూపు చూసినా, అతను వేసిన చిత్రాలు చూసి ముక్కునవేలేసుక్న్నారు. నమ్మలేకపోయారు. అమాయకంగా నలుగురిలో కలవక ఉండే ఈ వ్యక్తిలో ఇంతటి సృజనాత్మకత ఉందా? అని అందరూ ఆశ్వర్యపోయారు. ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారుడు అయ్యాడు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ' మేయో ' బంగారు పతకాన్ని రామారావు పొందాడు. వెంటనే చిత్రకళశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్వానం వచ్చింది. కాని స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగివచ్చాడు. 1922లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన ' ఋష్యశృంగ బంధనం ' చిత్రానికి ప్రథమ బహుమతిగా ' వైస్రాయి ఆఫ్ ఇండియా ' పతకం వచ్చింది. అంతేకాకుండా అప్పటి వైస్రాయి లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాల్లో ఒకదాన్ని కొన్నాడు. రామారావు చిత్రించిన గొల్లపడుచు, గోదావరి లోయ, పుష్పాలంకారం,ద్రోణుడు,' సిద్ధార్థుని రాగోదయం' ' బావి దగ్గర ' భరతవంశపు రాకుమారులు, కైకేయీ దురాలోచన నంది పూజ, పేరంటము, గొల్లపడుచులు, కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.
==చిత్రకళా ప్రతిభ==
ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులను అబ్బురపరిచాయి. వారు ఆతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరించారు. [[కలకత్తా]] , [[బొంబాయి]] వంటి మహానగరాల్లో జరిగిన బ్రిటీషు ఎంపైర్ ప్రదర్శనశాలలో దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను ఒక సంవత్సరం పాటు అక్కడి గ్యాలరీలో ఆయన బొమ్మలుంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు తార్కాణం.
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
▲1923లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణను ఈయన ఇచ్చాడు. 1925 లో 48 ఏళ్ళకే ఆయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని ' దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీ ' లో భద్రపరచారు. ఆ కీర్తిశేషుని పేర ఒక చిత్రకళామందిరం వెలసింది. అందులో ఆయన వేసిన చిత్రాలు ఉన్నాయి.
|