త్రిజట: కూర్పుల మధ్య తేడాలు

చి వనరులు
షోడశి
పంక్తి 1:
'''త్రిజట''' ఒక వృద్ధురాలు రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించి కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఈమె ఒకరు. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, రావణుడు యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వచ్చెను. [[సుందర కాండ]]లో త్రిజట స్వప్నం గురించి వృత్తాంతం ఉన్నది. త్రిజట [[విభీషణుడు|విభీషణుని]] కూతురుఅని అంటారు గాని ఇది సరి కాదని [[గుంటూరు శేషేంద్ర శర్మ]] వ్రాశాడు. గోవిందరాజీయములో "త్రిజటా విభీషణ పుత్రీ" అన్న పదాలను తప్పుగా వివరిస్తున్నఅరని అతని భావన.విభీషణుని కూతురు పేరు "నల". త్రిజట వృద్ధురాలైన వనిత గనుక విభీషణుని కూతురు కానేరదు. వాల్మీకి రచనలో "త్రిజటా వృద్ధా ప్రబుద్ధా వాక్యమబ్రవీత్" అని ఉన్నది. <ref name="shodasi">[[గుంటూరు శేషేంద్ర శర్మ]] రచన [[షోడశి - రామాయణ రహస్యములు]] (1965లో ఆంధ్ర ప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితఙయన వ్యాసముల సంకలనం) - జ్యోత్స్న ప్రచురణలు - 1967, 1980, 2000 </ref>
'''త్రిజట''' [[విభీషణుడు|విభీషణుని]] కూతురు. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించి ఈమెను కావలి వుంచెను. ఈమెకు [[శ్రీరాముడు]] సముద్రము దాటివచ్చినట్లు, రావణుడు యుద్ధంలో చనిపోయినట్లు [[కల]] వచ్చెను.
 
[[సుందర కాండ]]లో త్రిజట స్వప్నం గురించి వృత్తాంతం ఉన్నది.
 
 
==సుందరకాండలో==
కామాతురుడైన [[రావణుడు]] సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది. సహృదయయైన [[త్రిజట]] అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, [[సీత]] వంటి పుణ్య స్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
 
 
"వేయి హంసలు పూన్చిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. నాలుగు దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత యున్నది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపైభాగాన నిలిచింది. ఎనిమిది వృషభములు పూన్చిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళారు.
 
 
 
"ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకొని రావణుడు మత్తిల్లి పుష్పకంనుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూన్చిన రధంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచుండెను. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి [[ఆకాశం]]లో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము ద్రావుచు, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు."
Line 18 ⟶ 22:
 
వైదేహీ! నువ్వు అనవుసరంగా శోకించకు. నీ భర్త విగత జీవుడు కాలేదు. రామలక్ష్మణులు కేవలం వివశులైయున్నారనడానికి నాకు పెక్కు లక్షణాలు కనిపిస్తున్నాయి - వీరి ముఖాలలో ఇంకా కోప చిహ్నాలు కనిపిస్తున్నాయి. నీరి ముఖాలలో ఇంకా కళ తప్పలేదు. సైన్యం చెల్లా చెదురు కాకుండా వారిని శ్రద్ధగా కాపాడుకొంటున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ దివ్యమైన పుష్పకం భర్తృహీనను మోయదు. కనుక [[రాముడు|రామ]] [[లక్ష్మణుడు|లక్ష్మణులు]] బ్రతికే ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా నేను నీమీది స్నేహంతో చెబుతున్నాను. నేను ఏనాడూ అబద్ధం ఆడను. నీవు శీలవతివి గనుక నా మనసును ఆకర్షించావు - అని సీతను అనునయించింది. సీత తన చేతులు జోడించి "నీ మాటే సత్యం కావాలి" అంది.
 
 
 
 
==విశేషాలు==
గుంటూరు శేషేంద్ర శర్మ వివరణ ప్రకారం త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24 వేల శ్లోకాలలో 12001వ శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది నాయక మణి. "త్రిజట" అనుటలోనే రహస్యమున్నది. త్రిజట ఏదో రాక్షసి కాదు. త్రిజటా శబ్దము గాయత్రీ దేవికి చెప్పబడిన వేయి నామములలో ఒక నామము ("త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః")<ref name="shodasi"/>
 
== వనరులు ==
 
{{మూలాలజాబితా}}
* వాల్మీకి రామాయణం, సరళ సుందర వచనము – రచన: బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి - ప్రచురణ:రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి (2005)
 
"https://te.wikipedia.org/wiki/త్రిజట" నుండి వెలికితీశారు