తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:T.Devender Gaud 01.JPG|250px|right|thumb|<center>నవతెలంగాణా ప్రజాపార్టీ స్థాపకుడు టి.దేవేందర్ గౌడ్</center>]]
[[రంగారెడ్డి]] జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] శాసనసభ్యుడుగాను, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన ప్రముఖ నేత '''టి.దేవేందర్ గౌడ్''' [[మహేశ్వరం]] మండలం [[తుక్కుగూడ]] గ్రామంలో [[1953]], [[మార్చి 18]]న జన్మించాడు.<ref> http://www.goudsinfo.com/famous-Devendergoud.htm </ref> కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో [[తెలుగుదేశం పార్టీ]] విధానాలు నచ్చి [[ఎన్.టి.రామారావు]] నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణా వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో [[2008]], [[జూన్ 23]]న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు. ఆ తరువాత నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటుచేశాడు. ఫిబ్రవరి [[2009]]లో తాను స్థాపించిన నవతెలమ్గాణా పార్టీని [[ప్రజారాజ్యం పార్టీ]]లో విలీనం చేశాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
1953, మార్చి 18న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన దేవేందర్ గౌడ్ పాఠశాల విద్య తరువాత ఇంటర్మీడియట్ ధర్మవంత్ కళాశాలలోను, వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ భద్రుకా కళాశాలలో పూర్తిచేశాడు. కళాశాలలో ఉన్నప్పుడే అతడు విద్యార్థి నాయకుడిగా వ్యవహరించాడు. విద్యాభ్యాసం అనంతరం ఎన్.టి.రామారావు నేతృత్వంలోని [[తెలుగుదేశం పార్టీ]] విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు.
పంక్తి 6:
తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో ప్రముఖ నేతగా పేరుతెచ్చుకున్నాడు. [[1988]]లో జిల్లా పరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత [[1994]] [[డిసెంబర్]] లో తొలిసారిగా [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. [[1999]] [[అక్టోబర్]] లో రెండో సారి కూడా భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికైనాడు. [[2004]] [[ఏప్రిల్]] లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.
==తెలుగుదేశం పార్టీకి రాజీనామా==
తెలుగుదేశం పార్టీలో తన తెలంగాణా వాదానికి సరైన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న పార్టీకి మరియు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు. [[2004]] ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణాలో పుంజుకొనేందుకు పార్టీ యత్నాలు ఫలిస్తున్న తరుణంలో దేవేందర్ నిష్క్రమణతో పార్టీకి మరో దెబ్బ తగిలింది. <ref> ఈనాడు దినపత్రిక, తేది 24.06.2008 </ref>. తరువాత దేవేందర్ గౌడ్ "నవ తెలంగాణా పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు.
 
==మూలాలు==