అభిజ్ఞాన శాకుంతలము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వుడు, తన కుమార్తె దుష్యంతుని తన భర్తగా ఎన్నుకున్నందుకు సంతోషిస్తాడు. ఆమె తల్లి కాబోతుందని తెలిసి భర్త దగ్గరకు పంపించే ఏర్పాట్లు చేస్తాడు. మార్గ మధ్యంలో నదిలో అలా నీళ్ళలో చేతులాడిస్తుండగా తనకు భర్త ఇచ్చిన ఉంగరాన్ని పోగొట్టుకుంటుంది శకుంతల. దుర్వాసును శాపం ప్రకారం ఆమెను గుర్తించలేకపోతాడు దుష్యంతుడు. దిక్కు తోచని శకుంతలను ఆమె తల్లియైన మేనక అడవిలోకి చేరుస్తుంది. ఆమె అక్కడే మగ శిశువుకు జన్మనిస్తుంది. ఇతడే భరతుడు. ఈయన పేరు మీదుగానే భారతదేశానికి భరతవర్షం అని పేరు వచ్చిందని ఒక వాదన.
 
ఇలా ఉండగా ఒకరోజు శకుంతల నదిలో పోగొట్టుకున్న ఉంగరం, ఒక చేప పొట్టలో చేరి చివరికి ఒక జాలరి చేతికి చిక్కుతుంది. సైనికులు ఆ జాలరిని రాజు దగ్గర హాజరుపరుస్తారు. ఆ ఉంగరాన్ని చూడగానే శాపవిమోచనమై ఆయనకు భార్య శకుంతల గుర్తుకువచ్చి ఆమెకు జరిగిన అన్యాయానికి చింతిస్తూ, ఆమె ఎక్కడుందో తెలియక కాలం గడుపుతుంటాడు. ఒక రోజు దుష్యంతుడు కశ్యపమహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సింహపు కూనలతో ఆడుకుంటున్న ఒక చిన్న బాలుడిని చూస్తాడు. ఆ బాలుడు స్వయానా తన పుత్రుడే అని తెలిసుకుంటాడు. బాలుడి ద్వారా భార్యను కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అభిజ్ఞాన_శాకుంతలము" నుండి వెలికితీశారు