కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి WPCleaner v2.05 - చెక్ వికీపీడియా ప్రాజెక్టు కొరకు దోషాలను సరిచేయండి (విరామ చిహ్నాలకు ముందు ఉన్న మూలం - మూసలలో తేదీ ఆకృతి - <nowiki> ట్యాగ్లు అంతర్గత లింక్ తరువాత ఉంటాయి.)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
 
పంక్తి 5:
| birth_date = 1822
| birth_place = [[పోర్‌బందర్]], [[గుజరాత్]], బ్రిటిష్ ఇండియా
| death_date = 188516 నవంబరు 16 1885
| death_place =
| parents =
పంక్తి 11:
| children = {{hlist|లక్ష్మీదాస్|కర్సాదాస్|రాలియత్ బహెన్|[[మహాత్మా గాంధీ|మోహన్‌దాస్]]}}
}}
కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ (1822 - 1885 నవంబరు 16)<ref>[http://www.geni.com/people/Karamchand-Gandhi/6000000003923108238 Karamchand Uttamchand Gandhi]</ref> కాబా గాంధీగా సుపరిచితుడు. అతను పోర్ బందరులో రాజకీయ నాయకుడు. అతను పోర్‌బందర్, రాజ్‌కోట్, వాంకనెర్ సంస్థానాలలో దీవాన్ గా పనిచేసాడు. అతను [[మహాత్మా గాంధీ]]<nowiki/>కి తండ్రి.
 
'''జీవిత విశేషాలు'''
 
గాంధీ కుటుంబం అప్పటి [[జునాగఢ్]] రాష్త్రానికి చెందిన కుటియానా గ్రామానికి చెందినవారు.<ref name="Gandhi before India">{{cite book|title=Gandhi before India|date=16 March 2015|publisher=Vintage Books|isbn=978-0-385-53230-3|pages=19–21}}</ref>. 17వ శతాబ్ద చివరిలో లేదా 18వశతాబ్ద ప్రారంభంలో లాజ్జీ గాంధీ [[పోర్‌బందర్|పోరుబందరుకు]] వెళ్ళి అప్పటి పాలకుడైన రాణా వద్ద ఉద్యోగంలో చేరాడు. అతని కుటుంబానికి చెందిన తరాలలో ఉత్తమ చంద్ గాంధీకి ముందు వరకు ఉన్న వారు రాష్ట్ర పరిపాలనా విభాగాలలో సివిల్ సర్వెంట్లుగా పనిచేసారు. ఉత్తమ్‌చంద్ గాంధీ గాంధీకి తండ్రి. అతను 19వ శతాబ్దంలో పోర్‌బందర్ రాణా అయిన ఖిమోజీరాజీ వద్ద దివాన్ గా పనిచేసాడు.<ref name="Gandhi before India" />. 1831లో రాణా ఖిమోజీరాజీ అకస్మాత్తుగా మరణించాడు. అతని కుమారుడు 12 యేండ్ల విక్మత్‌జీ. దీని ఫలితంగా రాణా ఖిమోజీరాజీ భార్య రాణీ రూపాలిబా తన కుమారుని కోసం రాజ్యపాలన చేపట్టింది. ఆమె వెంటనే ఉత్తమ్‌చంద్‌తో కలిసి జునాగఢ్ లోని తన పూర్వీకుల గ్రామానికి తిరిగి రావాలని బలవంతం చేసింది. జునాగఢ్ చేరిన ఉత్తమ చంద్ నవాబ్ ఎదుట నిలిచి తన ఎడమ చేతితో అభివాదం చేసాడు. తన కుడి చేయి పోర్ బందర్ సేవకు అంకితమైందని తెలిపాడు.
 
1841 లో, విక్మత్జీ సింహాసనాన్ని స్వీకరించాడు. ఉత్తమ్‌చంద్‌ను తన దివాన్‌గా తిరిగి నియమించాడు.
 
కరంచంద్ చాలా తక్కువ నియత విద్యను కలిగి ఉన్నాడు. కానీ అతని జ్ఞానం, అనుభవం అతన్ని మంచి నిర్వాహకుడిగా చేసింది. అతను దయ, ఉదారంగా ఉంటాడని, కానీ తక్కువ నిగ్రహాన్ని కలిగి ఉంటాడని చెప్పబడింది.<ref>{{Cite web |url=http://goodtimes.ndtv.com/PhotoDetail.aspx?Page=2&ID=15732&AlbumType=PG |title=All about the Father of the Nation - Mahatma Gandhi |access-date=2020-10-02 |website= |archive-date=2014-08-19 |archive-url=https://web.archive.org/web/20140819085538/http://goodtimes.ndtv.com/PhotoDetail.aspx?Page=2&ID=15732&AlbumType=PG |url-status=dead }}</ref>.
 
తన తండ్రి ఉత్తమ్‌చంద్ గాంధీ వలె, కరంచంద్ గాంధీ పోర్‌బందర్ లో స్థానికంగా పాలిస్తున్న యువరాజు వద్ద కోర్టు అధికారి లేదా ముఖ్యమంత్రి అయ్యాడు. కరంచంద్ తన విధుల్లో భాగంగా పోర్‌బందర్ రాజకుటుంబానికి సలహా ఇవ్వడం, ఇతర ప్రభుత్వ అధికారులను నియమించడం వంటివి ఉండేవి.