చవ్‌దార్ చెరువు ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''చవ్‌దార్‌ చెరువు ఉద్యమం''' డా. [[బి.ఆర్‌ఆర్.అంబేద్కర్‌అంబేద్కర్]] నాయకత్వాన [[1927]], [[మార్చి 20]] న జరిగింది. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాద్‌లో నివాసాలు ఏర్పరచుకున్నారు. మహాద్‌లో బాబా సాహెబ్‌ మూడు సూత్రాలను సూచించాడు. అవి -1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఆలోచన మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. ఆ సమయంలోనే [[మహాద్‌ మునిసిపాలిటీ]] ఒక తీర్మానం చేసింది. `మహాద్‌ చెరువు సార్వజనికమైనది, దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చు' అని ఈ తీర్మానం సారాంశం. మహాద్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలనే లక్ష్యంతో బాబాసాహెబ్‌ ముందు నడవగా ఐదువేల మందితో దళిత సమాజం చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకుంది. బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై అకస్మాత్తుగా అగ్రవర్ణ గుండాలు దండెత్తి వచ్చి [[లాఠీ]]ల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన దళిత ప్రతినిధులను కొట్టారు. 1927 జూన్‌ 6వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఆ తర్వాత అగ్రకులస్తులు చవ్‌దార్‌ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చవ్‌దార్‌ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి పేడ, గోమూత్రం పోగుచేసి పాలు, పెరుగుతో సహా బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చవ్‌దార్‌ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. అనంతరం ఆగస్టు 4వ తేదీన మహాద్‌ మున్సిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ చర్యను అంబేడ్కర్‌ వ్యతిరేకించి చవ్‌దార్‌ చెరువు నీళ్ళను సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాడు. పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు. వారు చనిపోయేదాకా సమానంగా ఉండాలి' అంటూ తీర్మానించారు.
 
==మూలాలు==