కృపాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి మరో వర్గం చేర్పు |
విస్తరణ |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
'''కృపాచార్యుడు''' [[శతానంద మహర్షి]] మనుమడు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు [[గురువు]]. మహాభారత యుద్ధమందు కౌరవుల తరపున యుద్ధం చేసినాడు. యుద్ధం ముగిసిన తరువాత బ్రతికిఉన్న వారిలో ఇతడు ఒకడు. ఎనిమిదిమంది చిరంజీవులలో ఒకడు. యుద్ధం తరువాత అర్జునుడి మనుమడైన [[పరీక్షిత్తు]] కు ఆచార్యునిగా నియమింపబడ్డాడు.
==జననం==
[[గౌతమ మహర్షి]] కి శర్ధ్వనుడు అనే కుమారుడున్నాడు. శర్ధ్వనుడు జన్మించడమే విల్లంబులతో జన్మించాడు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. ఇతనికి చిన్నతనం నుంచే వేదాల మీద కన్నా అస్త్ర విద్యలపైన ఎక్కువగా ఆసక్తిని కనబరచసాగాడు. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. దీన్ని గమనిస్తున్న దేవతలు, ముఖ్యంగా ఇంద్రుడు కలపడసాగారు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన ''జనపది'' అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. ఆమె శర్ధ్వనుడి వద్దకు వచ్చి వివిధ రకాలుగా ఆకర్షించడానికి ప్రయత్నించింది.
[[వర్గం:పురాణ పాత్రలు]]
|