తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో ప్రముఖ నేతగా పేరుతెచ్చుకున్నాడు. [[1988]]లో జిల్లా పరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత [[1994]] [[డిసెంబర్]] లో తొలిసారిగా [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. [[1999]] [[అక్టోబర్]] లో రెండో సారి కూడా భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికైనాడు. [[2004]] [[ఏప్రిల్]] లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.
==తెలుగుదేశం పార్టీకి రాజీనామా==
తెలుగుదేశం పార్టీలో తన తెలంగాణా వాదానికి సరైన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న పార్టీకి మరియు శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు. [[2004]] ఎన్నికల్లో ఓటమి తరువాత తెలంగాణాలో పుంజుకొనేందుకు పార్టీ యత్నాలు ఫలిస్తున్న తరుణంలో దేవేందర్ నిష్క్రమణతో పార్టీకి మరో దెబ్బ తగిలింది. <ref> ఈనాడు దినపత్రిక, తేది 24.06.2008 </ref>. తరువాత దేవేందర్ గౌడ్ "నవ తెలంగాణా పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు.
==ప్రజారాజ్యంలో విలీనం==
ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు. [[2009]] ఎన్నికలలో దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం పార్టీ తరఫున [[మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009</ref>
 
==మూలాలు==