ధృతరాష్ట్రుడు: కూర్పుల మధ్య తేడాలు

మహాభారతంలో పాత్ర
కొత్త వ్యాసం
(తేడా లేదు)

11:45, 2 ఏప్రిల్ 2009 నాటి కూర్పు

ధృతరాష్ట్రుడు, మహాభారతంలో కౌరవులకు తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. విచిత్రవీర్యుడి మొదటి భార్యయైన అంబిక కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన గాంధారి ని పెళ్ళాడాడు. ధుర్యోధనుడు, మరియు దుశ్శాసనుడు ఈయనకు మొదటి ఇరువురు పుత్రులు.

జననం

విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన సత్యవతి తన మొదటి కొడుకైన వ్యాసుని కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు అంబికను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన అంబాలిక కు జన్మించిన పాండురాజు హస్తినాపురాన్ని పరిపాలించాడు.