బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: no:Banasura
పంక్తి 14:
 
==ఉషా అనిరుద్ధుల ప్రణయం==
బాణాసురిని కూతురైన [[ఉష]] దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలొ అసమాన్య ప్రావిణ్యం ఉండేది. ఒకరొజూ ఉషా దేవి స్వప్నంలొ ఒక రాకుమారుడు కనిపించి ఆమెను [[ఆలింగనం]] చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖ కు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతొ సమస్త భూగోళంలొ ఉండే రాకుమారుల చిత్తురవులు గీసి చూపుతుంది. అందులొని ఒక చిత్తురువు చూసి ఎవరే ఈ నవమోహనమోహనాంగుడునవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తురవు చూసి ఈ రాకుమారుడా [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] కుమారుడైన [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్నుడి]] కుమారుడు [[అనిరుద్ధుడు]] అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధిని [[బృందావనం]] నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలొ మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నపిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడం తొ బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు, ఆ సమయంలొ బాణాసురిడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనం లొ అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాధక సూత్రదారి శ్రీకృష్ణుడు [[నారదుడు|నారదుడి]] ద్వారా ఈ విషాయాన్ని గ్రహిస్తాడు.
 
==శైవజ్వరం వైష్ణవ జ్వరం==
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు