బేతవోలు (చిలుకూరు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బేతవోలు''', [[నల్గొండ]] జిల్లా, [[చిలుకూరు (నల్గొండ జిల్లా)]] మండలానికి చెందిన గ్రామము.
బేతవోలు గ్రామం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిలుకూరు మండలంలో కలదు. బేతవోలు గ్రామము చిలుకూరు మండలంలోని గ్రామాల్లో కెల్లా పెద్ద గ్రామము. ఈ గ్రామము సూర్యాపేట రెవెన్యూ డివిజన్ క్రిందకు వచ్చును. ఈ గ్రామము కోదాడ శాసన సభ నియోజక వర్గం మరియు నల్లగొండ లోక్ సభ నియోజక వర్గం క్రిందకు వచ్చును.ఈ గ్రామం యొక్క రెవెన్యూ మండలంలోని మిగతా గ్రామాలన్నింటి కన్నా ఎక్కువ.
 
==ఆదాయ వనరులు==
బేతవోలు గ్రామ ప్రజల ప్రధాన జీవనాధారం [[వ్యవసాయం]] మరియు వ్యవసాయ సంబంద కూలీ పనులు. ఈ గ్రామంలో ప్రధాన వ్యవసాయ పంట [[వరి]]. ఈ గ్రామంలో పండించిన వరి ధాన్యానికి మంచి ధర లభించును.ఇక్కడ పండించిన ధాన్యం ఇతర రాష్త్రాలకు ముఖ్యంగా తమిళనాడు లోని చెన్నై నగరమునకు ఎగుమతి అగును. గ్రామంలోని రైతులు వ్యవసాయం ద్వారానే కాక పాలు, కూరగాయలు అమ్మటం ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకుంటారు.ఈ గ్రామం యొక్క రెవెన్యూ మండలంలోని మిగతా గ్రామాలన్నింటి కన్నా ఎక్కువ.
 
గ్రామంలో రెండు చెరువులు ఉండటం వలన బెస్త వారు (గంగ పుత్రులు)చేపలు పట్టటం కూడా చేస్తూ ఉంటారు. గ్రామంలోని పెద్ద చెరువులో చేపలు పెంచి అమ్ముకొనుటకు చెరువుని లీజుకి ఇస్తారు. ఈ చెరువులో ఇలా పెంచి పట్టిన చేపలను కొల్కొతా(కలకత్తా) నగరానికి ఎగుమతి చేస్తారు. గ్రామానికి తూర్పున పెద్ద చెరువు పడమరన చిన్న చెరువు ఉన్నాయి. పెద్ద చెరువును వీర్ల దేవి చెరువు అని అంటారు. వీర్ల దేవి చెరువు నిర్మాణం జరిగి 100 సంవత్సరములు దాటినది. దీని క్రింద దాదాపు 1500 ఎకరముల వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.చిన్న చెరువు క్రింద దాదాపు 200 ఎకరముల దాకా వ్యవసాయ భూమి సాగు అవుచున్నది.
"https://te.wikipedia.org/wiki/బేతవోలు_(చిలుకూరు)" నుండి వెలికితీశారు