శుభలేఖ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==కథ==
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నరసింహ మూర్తి ([[చిరంజీవి]]) డిగ్రీలో తప్పటంతో ఒక స్టార్ హోటల్లో పని చేస్తూ వెయిటర్ గా పని చేస్తూ ఉంటాడు. అంకెల ఆదిశేషయ్య ([[కైకాల సత్యనారాయణ]]) నడుపుతున్న కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న సుజాత ([[సుమలత]]) అతనికి పరిచయం అవుతుంది. ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ ([[గిరీశ్]])తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం సుజాత కుటుంబం స్తోమత కి మించగా, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఇంటినుండి పంపించేస్తారు. ఆదిశేషయ్య కూడా తనని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన తనకి తన ఇంటిలోనే చోటిస్తాడు మూర్తి. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ్అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని బయటపెట్టి మూర్తి అతనిని అవమానించగా, రౌడీలతో అతనిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు ఆదిశేషయ్య. సుజాతతో బాటు [[హైదరాబాదు]] చేరి, తనకి పరిచయం ఉన్న ఆల్విన్ లో ఉన్నతోద్యోగంలోఉన్నతోద్యోగి ఉన్నఅయిన రావు ([[అరుణ్]]) తో మాటాడి సుజాతకి ఉద్యోగం ఇప్పిస్తాడు మూర్తి. సుజాత చెల్లెలు లక్ష్మి ([[తులసి]]) ని మోహన్ తమ్ముడు మురళి ([[శుభలేఖ సుధాకర్]]) ప్రేమిస్తాడు. లక్ష్మితో పెళ్ళి జరిపించకపోతే ఆత్మహత్య చేస్కొంటానన్న మురళి బెదిరింపుకు భయపడి, తక్కువ కట్నంతోనే మురళి, తులసి ల పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు ఆదిశేషయ్య.
 
మూర్తి, సుజాతల పెళ్ళికి మురళి, లక్ష్మిలు ఏం చేశారు, అన్నది చిత్రానికి ముగింపు.
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ_(సినిమా)" నుండి వెలికితీశారు