కోన ప్రభాకరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+మూలాలు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8:
ప్రభాకరరావు 1940 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ [[శాసన సభ]]కు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన [[బాపట్ల శాసనసభ నియోజకవర్గం]] నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. [[భవనం వెంకట్రామ్]] మరియు [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] మంత్రివర్గాలలో విత్త మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న [[పాండిచ్చేరి]] గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న [[సిక్కిం]] గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న [[మహారాష్ట్ర]] గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రిల్లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చేలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడ్డంతో మహారాష్ట్ర స్పీకరు పదవికి రాజీనామా చేశాడు.<ref>President Shankar Dayal Sharma, the Scholar and the Statesman By Attar Chand పేజీ.46 [http://books.google.com/books?id=iCReqnq6j0oC&pg=PA46&dq=Kona+Prabhakar+rao]</ref>
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంతవూరులో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
|