సువర్ణసుందరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21:
సువర్ణసుందరి ఇంద్రుని సభనందు నాట్యం చేయుచున్నపుడు జయంతుడు వేణువు ఊదటం వలన ఆమె రాలేక సభలో నాట్యం చేయలేక పడిపోతుంది. ఆమెను పరిక్షీంచిన ఇంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొంటాడు. దేవసభ నియమాలను తప్పినందుకు ఆమె మానవకన్యగా మారిపోవాలని, ఆమె ఆమెను మరచిపోతాడని ఆమె భర్తను తాకిన మరుక్షణం అతడు శిలగా మారిపోతాడని శాపం ఇస్తాడు. మరుక్షణం ఆమె భూమిపై పడి అక్కడే ఒక బిడ్దను కంటుంది,
తరువాత ఆమెని చెరబట్టాలని వెంబడించిన ఒకని నుండి పారిపోతూ బిడ్దడిని పోగొట్టుకొంటుంది. ఆ సంధర్భంలో భర్త కనిపించినా అతడిని సమీపించుటకు భయపడుతుంది. ఆమె కొడుకు ఒక పసువుల కాపరి వద్ద పెరుగుతూ తన అమ్మానాన్నలనుగురించి అడుగుతాడు. అతడు చనిపోతూ అతని తలిదండ్రులను వెతకమని చెప్పి పోతాడు. బాలుడు వెతుకుతూ ఒక గుహలో కల పార్వతీపరమేశ్వరుల ప్రతిమల వద్ద సృహ కోల్పోతాడు. పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడిని లాలిస్తరు. తన తలిదండ్రుల గురించి అడిగిన అతడికి తామే అతని తలిదండ్రులమని చెపుతారు. ఒకానొక సంధర్భంలో జయంతుడు,సువర్ణ సుందరి అక్కడ కలుసుకొంటారు. ఆ సంధర్భంలో ఆమె జయంతుని ముట్టుకోవడంతో అతడు శీలలా మారిపోతాడు. అక్కడ ఉన్న బాలుడు పార్వతి పరమేశ్వరులను వేడినా రాకపోయే సరికి తలపగలగొట్టుకొను ప్రయత్నమున పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై అతడు వారి కుమారుడే అని తెలిపి ఇంద్రలోకమున కల కలువ తెచ్చి జయంతుని తలపై ఉంచితే శాపవిమోచనము జరుగుతుందని తెలియచేస్తారు. బాలుడు అది తెచ్చి తన తండ్రికి శాపవిమోచనము కావిస్తాడు. వారు తిరిగి తమ రాజ్యానికి వెళ్ళడంతో కధ సమాప్తం అవుతుంది.
|