ఆలూరి బైరాగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
 
బైరాగి, [[తెనాలి]] తాలూకాలోని [[ఐతానగరం]]లో 1925, నవంబర్ 5వ తేదీన సరస్వతి, వెంకట్రాయుడు దంపతులకు మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. బైరాగి రెండవ తరగతి వరకే తెలుగులో చదువుకున్నాడు. ఆయన తండ్రి [[హిందీ]] చదవమని ప్రోత్సహించడంతో 1935 ప్రాంతాల్లో [[యలమంచిలి వెంకటప్పయ్య ]] స్థాపించిన హిందీ పాఠశాలలో చేరారు. పదమూడో ఏట హిందీలో ఉన్నత విద్యనభ్యసించడానికి ఆయన ఉత్తరాది వెళ్లారు. పదిహేనో ఏట ఆయన హిందీలో కవితలు రాసి కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. తన కవితా వ్యాసంగపు తొలినాళ్లలోనే ''పలాయన్'' అనే పేరుతో హిందీ కవితా సంకలనం ప్రచురించారు. [[ఎం.ఎన్.రాయ్]] నెలకొల్పిన ర్యాడికల్ డెమోక్రాటిక్ పార్టీకే అంకితమయ్యారు. స్వతహాగా ఇంగ్లీషు నేర్చుకొని ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 1946లో గుంటూరు జిల్లా [[ప్రత్తిపాడు]] హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగా చేరారు. తెలుగులో బైరాగి మొదటి కవితా సంకలనం ''చీకటి నీడలు'' ప్రచురించారు. బైరాగి పినతండ్రి, చందమామ వ్యవస్థాపకులలో ఒకరైన [[చక్రపాణి]] (ఆలూరు వెంకట సుబ్బారావు) హిందీ [[చందమామ]]కు సంపాదకత్వం వహించమని కోరడంతో మకాం మద్రాసుకు మార్చారు. తొలినుంచీ స్వేచ్ఛాజీవి అయిన బైరాగి చందమామలో కొనసాగలేక బయటకు వెళ్లిపోయారు. ''నూతిలో కప్పలు'', ''దివ్యభవనం'' కథా సంపుటిని ప్రచురించారు. బైరాగి రచనలలో కెల్లా ''నూతిలో కప్పలు'' ఆయన ఉత్కృష్ట రచన.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆలూరి_బైరాగి" నుండి వెలికితీశారు