మనిషికో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

సంక్షిప్త కధ
కధ
పంక్తి 12:
imdb_id=0339350}}
 
నాలుగిళ్ళ లోగిలిలో కాపురముండే నాలుగు మధ్య తరగతి కుటుంబాల సమస్యల చుట్టూ తిరిగే కధాంశంతో రూపుదిద్దుకొన్న ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో గణేష్ పాత్రో రచన, కోడి రామకృష్ణ దర్శకత్వంతో పాటు గొల్లపూడి మారుతీరావు నటన, సంభాషణలు మంచి ప్రజాదరణ పొందాయి. ఫార్ములా కధలకు భిన్నంగా ఉన్న ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది.
 
 
==సంక్షిప్త కధ==
నాలుగిళ్ళ నడవాలో నాలుగు కుటుంబాలు కాపురముంటాయి. అందులో ఒక జంట (మురళీ మోహన్, సుహాసిని) చాలీచాలని సంపాదనతో సతమతమవుతుంటారు. మురళీమోహన్‌కు సంపాదన తక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ, భార్యతో ఉద్యోగం చేయించడం, ఆమె పుట్టింటినుండి సహాయం అందుకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఒక చిన్నగదిలో ఉండే బడిపంఉలు (హేమసుందర్?) కాపురమంతా భార్యకు ఉత్తరాలు వ్రాయడానికే పరిమితం. అతనొక చోట, అతని భార్య మరొక చోట ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరో ఒకరికి బదిలీ కావాలని అతను ఎడతెరిపిలేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరొక జంట (చంద్ర మోహన్, ప్రభ) ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అక్కడ వారే కాస్త స్థితిమంతులు. ఉద్యోగం మానేసి చక్కగా పిల్లలను కని సంసారం చేయాలని ప్రభ కోరిక. భార్య తెచ్చే సంపాదన విలువ తెలిసిన చంద్రమోహన్ అందుకు ఒప్పుకోడు. ధారాళంగా వరండాలో కూర్చుని భార్య జాకెట్టుకు హుక్కులు కుట్టడం అతనికి చిన్నతనం అనిపించదు.
 
 
ఇక నాలుగో కుటుంబం ఇ కధలో కేంద్రస్థానం ఆక్రమిస్తుంది. గెద్దముక్కుపంతులు (లేదా మరో పేరు - సరి చూడాలి)గా గొల్లపూడి మారుతీరావు, అతని భార్యగా అన్నపూర్ణ నటించారు. ఇంట్లో ఒక్కో సామాను అమ్మేస్తూ అన్నపూర్ణ సంసారం నెట్టుకొస్తుంటుంది. గొల్లపూడి మారుతీరావు పనీపాటా లేకుండా పొద్దస్తమానం వార్తా పత్రికలు తిరగేస్తూ ప్రపంచంలోని సకల వ్యవహారాలనూ పరిశిలించి చర్చిస్తుంటాడు. తన మెలిక సంభాషణలతో అందరి తలలూ తింటుంటాడు. వారి కొడుకు కూడా పనీపాటా లేకుండా తన అభిమాన హీరో ఫంక్షనుల కోసం పొద్దస్తమానం ఖాళీలేకుండా తిరుగుతుంటాడు. ఇంట్లో బిందెలమ్మేసి హీరో ఫంక్షనులకు డబ్బు సమకూర్చుకొంటుంటాడు. వారి కూతురు దుర్గ (పూర్ణిమ) షుమారు పద్ధెనిమిదేళ్ళ పిల్ల. ఇంట్లో పరిస్థితులను అర్ధం చేసుకొంటుంది.
 
 
వారికి పాలుపోసే అమ్మాయి (జయమాలిని?) తెలివైనది, మంచిది. ఆమె గేదె సినిమా పోస్టరులు తింటూ పాలిస్తుంది. ముఖ్యంగా ఎన్.టి. రామారావు సినిమా పోస్టరులైతే దానికిష్టం. ఎన్టీబాబు సినిమాలు తగ్గిపోయాక దాని పాలు తగ్గిపోతున్నాయి గనుక క్రొత్త హీరోలను అభిమానించడం నేర్చుకోమని ఆ గేదెకు ఆమె హితవు చెబుతుంటుంది. ఆ పాలమ్మాయి సహాయంతో, తన తల్లిదండ్రులకు తెలియకుండా, దుర్గ ఒక ఇంట్లో పనికి కుదురుతుంది. అజ్ఞాతంగా తన జీతం నెలనెలా తల్లిదండ్రులకు మనియార్డరు చేస్తుంటుంది. చివరికి ఆ డబ్బు పంపపేది దుర్గేనని తెలిసికొని ఆమెతండ్రి ఆమెను నిలదీస్తాడు. అవినీతికి పాల్పడకుండా ఒక ఆడపిల్ల అంతడబ్బు ఎలా సంపాదిస్తుందో జవాబు కావాలని తండ్రిగా ఆమెను శాసిస్తాడు. అందుకు దుర్గ చెప్పిన జవాబు - "నా తండ్రి అని చెప్పుకొనే హక్కు నీకెక్కడుంది? పిల్లలకోసం ఏమైనా చేశావా? కేవలం పిల్లలను పుట్టించడమే నీ అర్హత అయితే నీ గొప్పతనాలు నీ భార్య దగ్గఱ చెప్పుకో కాని పిల్లలమీద నీకు హక్కు లేని అధికారం చెలాయించవద్దు." దానితో దిమ్మతిరిగి ఆ తండ్రి మనసు మారుతుంది. ఒక కలిగినవారింట్లో రోగిష్టి ఆడమనిషికి సేవ చేయడమే దుర్గ చేసే ఉద్యోగం అని పాలమనిషి వారికి వివరిస్తుంది.
 
 
 
ఇలా ఆ లోగిలిలో నాలుగు కుటుంబాలలోనూ కొన్ని మార్పులు వస్తాయి. గొల్లపూడి మారుతీరావు పునుగులు, వడలు అమ్మడం మొదలు పెడతాడు. అతని కొడుకు సినిమా పోస్టరులు అంటించే ని చేసుకొంటూ కొంత సంపానలో పడతాడు. ఇక తన భార్య ఉద్యోగం చేయడానికి మురళీమోహన్ ఒప్పుకొంటాడు. తన భార్య ఉద్యోగం మానేయడానికి చంద్రమోహన్ ఒప్పుకొంటాడు. బడి మాష్టరుకు అతని భార్య ఉండే వూరికి బదిలీ లభిస్తుంది కాని అతని భార్యకు ఈ వూరికి బదిలీ అవుతుంది. వారు రైలు మారే సమయంలో రైల్వేస్టేషనులో కలుసుకోవాలని ఆశిస్తారు.
 
 
==పాటలు==
 
 
==విశేషాలు==
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/మనిషికో_చరిత్ర" నుండి వెలికితీశారు