కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి యంత్రము కలుపుతున్నది: ta:கும்பகர்ணன்; cosmetic changes |
||
పంక్తి 1:
[[
'''కుంభకర్ణుడు''' (Kumbhakarna, సంస్కృతం:कुम्भकर्ण) [[రామాయణం]] కావ్యంలో [[రావణుడు|రావణుని]] తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు [[కైకసి]]కి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం.
== కుంభకర్ణ జన్మవృత్తాంతం ==
[[భాగవత పురాణం]] అధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరు కొనగా
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]] , [[హిరణ్యకశ్యపుడు]] గా
* [[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో
* [[ద్వాపరయుగము|ద్వాపర యుగం]] లొ [[శిశుపాలుడు]], [[దంతవక్ర్తుడు]] గా జన్మించి
: శాపవిమౌచన పొంది [[విష్ణువు|మహావిష్ణువు]]ని [[వైకుంఠం|వైకుంఠాన్ని]] చేరుకొన్నారు.
ఈ [[త్రేతాయుగం]] లొ ఈ విధంగా
[[బ్రాహ్మాణులు|బ్రహ్మాణ సాద్వి]] అయిన విషర్వసునికి [[దైత్యులు|దైత్య రాకుమారైన]] [[కైకసికి]] రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి [[సుమాలి]]. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు కావాలని కోరికతో అందరు రాకుమారుని అంగీకరించకుండా మాహాసాద్వి అయిన విష్వరసు ఇచ్చి వివాహం చేస్తాడు. ఒకసారి కైకేసి సమయం కాని సమయంలో విశ్వరసు
== కుంభకర్ణుడి నిద్ర ==
కుంభకర్ణుని శరీరవిస్తీర్ణాన్ని గురించి, నిద్ర గురించి, బలాన్ని గురించి వివిధ గాధలున్నాయి. కుంభ కర్ణుడు ఆరువందల ధనువుల పొడవు అనీ , వాని కైవారం
వాల్మీకి రామాయణం [[యుద్ధకాండ]]లో [[విభీషణుడు]] [[శ్రీరాముడు|రామునకు]]
యుద్ధానికి ముందు [[రావణుడు]] తన మంత్రులతో రానున్న విపత్తు గురించి చర్చించాడు. ఆరోజు కుంభకర్ణుడు మేలుకొని వున్నరోజు. విషయం తెలుసుకొని కుంభకర్ణుడు రావణుడు [[సీత]]ను అపహరిండం పొరపాటని అభిప్రాయపడ్డాడు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. సోదరప్రేమతో ఇలా చెబుతున్నాను. ఇక యుద్ధంలో నేను సమస్త వానరసేననూ, రామ లక్ష్మణులనూ తినేస్తాను. నువ్వు మధువు సేవించి నిశ్చింతగా వుండు అని ధైర్యం చెప్పాడు. తరువాత యధాప్రకారం నిద్రలోకి జారుకున్నాడు.
== కుంభకర్ణుడిని నిద్ర లేపడం ==
ప్రహస్తుని మరణానంతరం రావణుడు స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. అంత తేజోమయుడూ రామునిచేతిలో భంగపడి వెనుకకు తెరిగి వచ్చాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుడిని నిద్ర లేపమని అనుచరులను ఆజ్ఞాపించాడు.
పంక్తి 29:
రాక్షస భృత్యులు ఎన్నో రకాల ఆహారాలు, మద్యాలు తీసికొని కుంభకర్ణుడి మందిరానికి వెళ్ళారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమయ్యింది. కుంభకర్ణుడు ఉచ్చాస నిశ్వాసాలు చేస్తుంటే నిద్ర లేపడానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాశికా రంధ్రాలలొ లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చారు. వాడిముందు ఆహారాన్ని, మద్యాన్ని వుంచి, పెద్దపెట్టున భేరీలు మ్రోగించారు. కర్రలతో కొట్టారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఏనుగులతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు.
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే, అదే అవకాశం అనుకొని
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మద్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరాడు. అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కారు, కొందరు సేతువు వైపు పారిపోయారు. అది చూసిన [[విభీషణుడు]] అంగదుడు , సుగ్రీవుడు తో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదించారు.
తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణు
నకు ఆపద తెచ్చాయని చింతించిన కుంభకర్ణుడు రావణుడికి ధైర్యం చెప్పి, నమస్కరించి, యుద్ధానికి బయలుదేరాడు.
== కుంభకర్ణుడి యుద్ధం ==
కోటగోడను ఒక్క అంగలో దాటి కుంభకర్ణుడు యుద్ధానికి రాగానే వానరసేన భయంతో పారిపోసాగింది. ఆ వచ్చేది ఒక యంత్రమనీ, రాక్షసుడు కాదనీ వానరసేనకు నచ్చజెప్పి అంగదుడు వారికి ధైర్యం చెప్పారు. వానరవీరులంతా ఒక్కుమ్మడిగా పైబడినా కుంభకర్ణుడికి ఈగలు ముసిరినట్లే అనిపించింది. వారు విసిరిన బండలు వాడి దేహానికి తగిలి పొడి ఐపోయాయి. [[హనుమంతుడు]] వాడి గుండెలమీద వేసిన పర్వత శిఖరం వలన మాత్రం కాస్త చలించి రక్తం కక్కుకున్నాడు. కుంభకర్ణుడు శూలంతో పొడవగా హనుమంతుడు కూడా బాధతో గర్జించాడు.
అంగదుడు, నీలుడు, ఋషభుడు, శరభుడు వంటి వీరులు కుంభకర్ణుడి చరుపులకు సృహ తప్పారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని విరిచేశాడు. కుంభకర్ణుడు సుగ్రీవుడిని చేత పట్టుకొని
లక్ష్మణుడు తీవ్రమైన ఏడు బాణాలతో కుంభకర్ణుని బాధించాడు. రాముడు వేసిన రౌద్రాస్త్రం వల్ల కుంభకర్ణుని నోట అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. నిరాయుధుడైన కుంభకర్ణుడు చేతులతోనూ, కాళ్ళతోనూ అందరినీ మర్దించసాగాడు. వాడిని నిలవరించడానికి ఎందరో వానరులు వాడిమీదకు ఎక్కినా వాడు వాళ్ళను విదిలించేశాడు. రాముడు వేసిన వాడి బాణాలు కూడా వాడిని ఆపలేకపోయాయి.
== కుంభకర్ణుడి మరణం ==
ఇక లాభం లేదని రాముడు వాయువ్యాస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతినీ,ఐంద్రాస్త్రంతో మరొక చేతినీ తెగగొట్టాడు. మరో రెండు మహిమాన్విత బాణాలతో కాళ్ళను నరికేశాడు. ఐనా రాహువులాగా కుంభకర్ణుడు ముందుకే వస్తున్నాడు. అపుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడిని సంహరించాడు. వాడి దేహం క్రింద పడి అనేక వానరులూ, రాక్షసులూ నలిగి మరణించారు దేవతలూ, గంధర్వులూ, మహర్షులూ రామచంద్రుని కీర్తించారు. వానర సేనా నాయకులు రాముని పూజించారు.
పంక్తి 53:
== వనరులు ==
* వాల్మీకి రామాయణం - సరళ సుందర వచనము - బ్రహ్మశ్రీ కొంపెల్ల వెంకటరామశాస్త్రి (రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి వారి ప్రచురణ)
{{రామాయణం}}
[[వర్గం:రాక్షసులు]]
[[వర్గం:రామాయణంలోని పాత్రలు]]
Line 64 ⟶ 65:
[[hi:कुम्भकर्ण]]
[[kn:ಕುಂಭಕರ್ಣ]]
[[ta:கும்பகர்ணன்]]
[[id:Kumbakarna]]
[[ja:クンバカルナ]]
|