పెళ్ళి చేసి చూడు (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
ఒక పల్లెలో తన తల్లి([[కన్నాంబ]]), చెల్లి అమ్మడు([[వరలక్ష్మి]])లతో నివసించే రాజు నాటకాలలో వేషాలేస్తూ ఆ ఊరి స్కూలులో పనిచేస్తుంటాడు. అతని మావయ్య అయిన గోవిందయ్య అదే ఊరిలో ఉంటూ మేనల్లుడిని తన కూతురుకు ఇచ్చి వివాహం చేయాలనుకొంటాడు. అతని పొరుగింటి దూరపు బందువు భీమన్న ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆమె కూడా ఇతడిని పెళ్ళిచేసుకోవలనుకొమ్టుంది. రాజు తన చెల్లి పెళ్ళి అయితే కాని తను పెళ్ళిచేసుకోనని సంభందాలకోసం వెంకటపతి అనే ఆయనను కలుసుకోవటం కోసం వేరే ఊరు వెళతాడు. అక్కడ పూటకూళ్ళమ్మ ద్వారా దూపాటి వియ్యన్న([[ఎస్.వి.రంగారావు]]) అనే ఆయన ద్వారా పని జరుగుతుందని తెలిసి ఆయన ఇంటికి వెళతాడు. ఆయన తన తండ్రికి స్నేహితుడని తెలుస్తుంది. ఆయన తన కూతురు చిట్టి([[సావిత్రి]])ని చేసుకోమని అతని చెల్లి పెళ్ళి తను చేస్తానని చెప్పడంతో చిట్టిని పెళ్ళాడుతాడు. [[మద్రాసు]]లో ఉద్ధ్యోగం చేస్తున్నవెంకటపతి కొడుకు రమణ([[ఎన్.టి.రామారవు]])తో వివాహం నిర్ణయిస్తారు. తన కూతురిని పెళ్ళి చేసుకోకపోవడం వలన ద్వేషంతో ఉన్న గోవిందయ్య వెంకటపతిని రెచ్చగొదతాడు. వివాహం పూర్తయ్యే సమయానికి వియ్యన్న అనుకొన్న మొత్తం ఇవ్వలేకపోవడంతో పెళ్ళిపీటలమీద ఉన్న తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు వెంకటపతి.
 
రాజు తన చెల్లి,తల్లి,బార్యల నగలు ఇంటి దస్తావేజులు తీసుకొని వెంకటపతి ఇంటికి వెళ్ళి తన చెల్లిని కాపురానికి తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతాడు. వెంకటపతి ససేమిరా అని మోసం చేసి తనకొడుకుతో తాళి కట్టించారని తిట్టి తనకొడుకుకు వేరే పెళ్ళి చేస్తానని చెపుతాడు. రమన అతడిని ప్రక్కకు తీసుకెళ్ళి తను తండ్రికి తెలియకుండా వస్తానని ప్రస్తుతం వెళ్ళిపొమ్మనీ చెపుతాడు. తరువాత తాను మద్రాసు పోతున్నానని చెప్పి అత్తగారి ఊరు వెళతాడు. అక్కడ కొద్దికాలం ఉండి తన భార్యను తీసుకొని మద్రాసు వెళతాడు. ఈ లోగా తనకు తండ్రి వేరే సంభందాలు చూస్తున్నట్టు తెలియడంతో తండ్రి వచ్చేసరికి పిచ్చిఎక్కినట్టుగా నాటకం ఆడుతూ తనకు సేవలు చేసే నర్సుగా తనభార్యను కూడా తనతో తీసుకొని ఊరు వెళతాడు.అక్కడ పిచ్చివాడైన తనకు నర్సులాంటి భార్య అయితే బావుంటుందనిపించేలా తండ్రికి చెప్పి మద్రాసు వెళతారు. అక్కడ గర్భవతి అయిన భార్యను తన అత్తగారి ఇంట దించి ఆమె బిడ్డను కన్న తరువాత తిరిగి తీసుకు వెళతాడు. ఇదంతా గమనించిన గోవిందయ్య రమణ నాటకం బట్టబయలు చేసేందుకు వెంకటపతితో కలసి మద్రాసు వస్తాడు. తండ్రి రాకతో మళ్ళీ పిచ్చి ఎక్కినట్టుగా నాతకం ఆడుతున్న కొడుకు చూస్తాడు.ఇంతలో లోపల పిల్లవాడి ఏడుపు వినబడటంతో లోనికి వెళ్ళి చూస్తారు.కోదలిని గమనిస్తాడు. ఆమెను వెంతనే ఇమ్టి నుండి వెళ్ళిపొమ్మని చెప్పి కొడుకుతో నీకు గోవిందయ్య కూతురితో వివాహం నిశ్చయించానని వెంటనే ఇంటికి రమ్మని లేదంటే తన ఆస్థిలో చిల్లి గవ్వ కూదా ఇవ్వననీ చెపుతాడు. తనకు ఆస్థి అవసరం లేదని భార్య వెంటే తానూ పోతానని సామాను తీసుకొని ఆమెను తీసుకొని వెళ్లబోతుంటే వియ్యన్న వచ్చి అతడిని ఆపి గోవిందయ్య కూతురుకు అప్పటికే అతని బందువు భీమన్నతో పెళ్ళి జరిగిందని మాయమాటలు చెప్పి వెంకటపతిని మోసం చేస్తున్నడని చెపుతాడు.
 
==ఇతర విశేషాలు==